AP High Court Hearing On Ys Jagan Quash Petition: మాజీ ముఖ్యమంత్రి జగన్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ వేసిన పిటిషన్పై విచారణ జూలై 1కి వాయిదా పడింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. ఇంతకీ ఈ కేసులో జగన్కు నిజంగానే ఊరట లభిస్తుందా? అసలు ఏం జరిగిందనేది వేచి చూడాల్సిందే.
హైలైట్:
- వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట
- అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దు
- మరో ఐదుగురికి ఊరట దక్కింది

ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో కాన్వాయ్ వెళుతుండగా.. జగన్ కారు కిందపడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వైఎస్ జగన్తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్ జగన్కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య కేసు మాత్రమే కాదు.. జగన్పై మరో కేసు కూడా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా వైఎస్సార్సీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చారు. అలాగే ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వైఎస్సార్సీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, కావటి మనోహర్నాయుడు తదితరులపై కేసు నమోదైంది.