Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children
ఆంధ్రప్రదేశ్

Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుప్పంలో జరిగిన ఓ ఘటన వైరల్ కాగా.. ఈ వీడియో షేర్ చేస్తూ రోజా విమర్శలు చేశారు. స్కూలు పిల్లలతో చెత్త ఎత్తిస్తున్నారంటూ రోజా ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమని.. దీనిపై ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

రోజా విమర్శలు
రోజా విమర్శలు (ఫోటోలు– Samayam Telugu)

మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతిపక్ష వాణి బలంగా వినిపిస్తున్నారు రోజా. విలేకర్ల సమావేశాలతో పాటుగా.. సోషల్ మీడియా ద్వారా కూడా రోజా తన గొంతు వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ ఘటనను మాజీ మంత్రి రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను రోజా కోరారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమంటూ రోజా ట్వీట్ చేశారు.

*ఏపీలో తొలిసారిగా.. కేంద్ర పథకం కింద రూ.10 లక్షలు..

” ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్‌లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు! “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?” అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా? నారా లోకేష్ గారు పేద పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి” అంటూ రోజా ట్వీట్ చేశారు.

*ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బాబా రాందేవ్.!

మరోవైపు రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. కుప్పం నియోజకవర్గానికి పొరుగున ఉంటుంది. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ సమస్యలను కూడా రోజా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోవైపు రోజా చేసిన ట్వీట్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదీ చూడాల్సి ఉంది. దీని వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..?

*ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.!

రోజాపై అండతో ఇబ్బంది పెడుతున్నారు

మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అండ చూసుకుని ఓ కానిస్టేబుల్ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తిరుపతి జిల్లాకు చెందిన ఓ కుటుంబం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. రోజా అండతో మునికుమార్ అనే కానిస్టేబుల్‌ తనను ఇబ్బంది పెడుతున్నారని వడమాలపేట మండలం సీతాపురంలో ఉండే డి.గుణశేఖర్‌ ఫిర్యాదు చేశారు. తన భూమిని వారికి నచ్చిన ధరకు అమ్మటం లేదనే కోపంతో.. దొంగ రిజిస్ట్రేషన్‌ అగ్రిమెంట్‌ తయారు చేసుకుని.. అలాగే పొలానికి వెళ్లే దారికి అడ్డుపడుతున్నారని ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి