Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. బుమ్రా ఔట్! జట్టులోకి ఎవరు రానున్నారంటే?

27 June 2025

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి నాటికి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం మంత్రి నారాయణ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు జూన్ 12 నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీపావళి నాటికి అందజేస్తామని మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు. మరోవైపు టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.!
ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! (ఫోటోలు– Samayam Telugu)

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మంత్రి పొంగూరు నారాయణ .. శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందన్నారు.

ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. మున్సిపాలిటీలు, పట్టణాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నారాయణ వివిరించారు.

మరోవైపు 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం పేదల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సుమారుగా 7 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 5 లక్షల ఇళ్లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. వాటిలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి.. 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి టిడ్కో ఇళ్ల మీద ఫోకస్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను 2025 జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1.18 లక్షల ఇళ్లను జూన్‌ 12 నాటికి పూర్తి చేయాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. అయితే వివిధ కారణాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడం లేదు. దసరాకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని ఇటీవల చెప్పిన మంత్రి నారాయణ.. దీపావళి నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తాజాగా వెల్లడించారు.

మరోవైపు టిడ్కో ఇళ్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అనర్హుల స్థానంలో కొత్త వారికి టిడ్కో ఇళ్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే వయోవృద్ధులు, సిబిల్‌ స్కోరు తక్కువగా ఉండేవారికి బ్యాంకు రుణం మంజూరు చేయించే అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఒకే విడతలో రుణం మొత్తం చెల్లిస్తారా అనేది పరిశీలించాలని.. లేకపోతే లబ్ధిదారు ఇంటిలో అర్హత ఉన్న వారితో జాయింట్‌ ఓనర్‌షిప్‌తో టిడ్కో ఇళ్లు కేటాయించాలని సూచించింది. టిడ్కో ఇల్లు కేటాయించిన లబ్ధిదారు చనిపోయి ఉంటే.. ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి