Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు.. మొత్తానికి అసలువిషయం బయట పెట్టిన సల్మాన్ ఖాన్

28 June 2025

రథయాత్ర ఉత్సవానికి కుటుంబంతో పాటు గౌతమ్ అదానీ హాజరు..

28 June 2025

రక్తహీనతకు అసలు కారణాలు ఇవే..! జాగ్రత్త పడలేదో అంతే సంగతి..!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Water Supply Workers Strike,విశాఖపట్నంలో కార్మికుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – visakhapatnam gvmc municipal corporation outsourcing water supply workers go on strike
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Water Supply Workers Strike,విశాఖపట్నంలో కార్మికుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – visakhapatnam gvmc municipal corporation outsourcing water supply workers go on strike

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Water Supply Workers Strike,విశాఖపట్నంలో కార్మికుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – visakhapatnam gvmc municipal corporation outsourcing water supply workers go on strike
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam GVMC Workers Strike: విశాఖపట్నంలో నీటి సరఫరా కార్మికులు వేతనాల పెంపు కోసం సమ్మెకు దిగడంతో నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ అధికారులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. కార్మికులు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. మేయర్ ప్రజలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైలైట్:

  • విశాఖపట్నంలో కార్మికులు సమ్మెకు దిగారు
  • నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ఛాన్స్
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
విశాఖ జీవీఎంసీ వాటర్‌ సప్లై ఉద్యోగుల సమ్మె
విశాఖ జీవీఎంసీ వాటర్‌ సప్లై ఉద్యోగుల సమ్మె (ఫోటోలు– Samayam Telugu)

విశాఖపట్నంవాసులకు పెద్ద కష్టమే వచ్చింది.. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (GVMC) నీటి సరఫరా ఆప్కాస్ కార్మికులు సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలని తీర్మానం చేసినా అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ కారణంగా శుక్రవారం నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మేయర్, GVMC అధికారులు, యూనియన్ నాయకుల మధ్య చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. వేతనాలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని కోరిన కార్మికులు జూన్ 10న సమ్మె చేస్తామని తొలుత ప్రకటించారు. అధికారులు స్పందించి 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జూన్ నెలకు కూడా పాత వేతనాలతోనే బిల్లులు సిద్ధం చేస్తుండటంతో కార్మికులు సమ్మెకు దిగారు. మేయర్ ఐదు రోజులు గడువు కోరినా కార్మికులు ససేమిరా అన్నారు. సమ్మెను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నీటి సరఫరా నిలిచిపోయినా ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేకుండా చేశారు. కానీ సమ్మె ప్రభావంతో నేటి నుంచి ఇబ్బందులు మొదలవుతాయంటున్నారు అధికారులు. కలెక్టర్ హరేంధిరప్రసాద్‌తో కార్మిక నేతలు చర్చించారు. అయితే. పరిశ్రమలకు మాత్రం నీటిని సరఫరా చేయడానికి కార్మికులు ఓకే చెప్పారు.

కార్మికుల సమ్మెతో నగరంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటిని సరఫరా చేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు నగరంలో వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శులకు (ఎమినిటీస్‌) బాధ్యతలు అప్పగించారు. పంపింగ్ స్టేషన్ల నుంచి వార్డుల్లో సరఫరా వరకు వారిదే బాధ్యత అప్పగించారు.. ఈ మేరకు దీనిని కార్యనిర్వాహక ఇంజినీర్లు దీనిని పర్యవేక్షిస్తారు. యూనియన్ నేతలు తమ డిమాండ్లపై వెనక్కు తగ్గడం లేదు. ఈ మేరకు అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నారు. వాస్తవానికి కార్మికులు గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మెను ప్రారంభఇంచారు.. పంపింగ్ నిలిపివేశారు. విశాఖపట్నం నగరంలో నీటి సరఫరా విభాగంలో మొత్తం 1274 మంది కార్మికులు ఉన్నారు.. వీరందరూ సమ్మెలో పాల్గొన్నారు. అయితే పెంచిన వేతనాలు ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు.

విశాఖపట్నంలో కార్మికుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే

‘ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తు న్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది’ అంటున్నారు. ‘తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలి. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలి’ అని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నానికి మరో దిగ్గజ ఐటీ కంపెనీ.. 8వేలమందికి ఉద్యోగాలు. విశాఖ: ప్రభుత్వ లాయర్‌కు వేతనం చెల్లించలేదని.. కలెక్టర్ కారు సహా ఫర్నీచర్ స్వాధీనం, కోర్టు ఆదేశాలు. విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష.. అసలేం జరిగిందంటే?

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి