TTD Free Insurance for Devotees: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. టీటీడీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఇది అమల్లోకి వస్తే.. దేశంలోనే మొదటిసారిగా ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఇలాంటి బీమా సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. దీని ద్వారా భక్తులకు మరింత భద్రత చేకూరుతుంది.

మరోవైపు తిరుమలకు ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వస్తుంటారు. సగటును నిత్యం 70,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక వారాంతాల్లో ,పండుగ సమయాల్లో భక్తుల సంఖ్య లక్ష వరకూ వెళ్తూ ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి ముఖ్యమైన పండుగల్లో ఈ సంఖ్య 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.
*శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక నిరీక్షించాల్సిన అవసరం లేదు.. టీటీడీ కొత్త ప్లాన్!
ఈ నేపథ్యంలో తిరుమల కొండకు వచ్చే శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ రిస్క్ అసెస్మెంట్ చేస్తోంది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం టీటీడీ ప్రమాదాలకు మాత్రమే బీమా కవరేజ్ అందిస్తోంది. అది కూడా అలిపిరి – తిరుమల మార్గాలకే పరిమితం. ఘాట్ రోడ్లలో ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.3 లక్షలు అందజేస్తోంది. అయితే సహజ మరణాలకు ఈ బీమా వర్తించదు. ట్రావెల్ , టూరిజం సంస్థలు టికెట్లతో పాటు బీమాను అందిస్తున్నాయి. కానీ టీటీడీ మాత్రం శ్రీవారి భక్తులకు ఉచితంగా బీమా సౌకర్యం అందించాలని యోచిస్తోంది.
తిరుమల: టీటీడీ కొత్త ఆలోచన.. శ్రీవారి భక్తులకు ఉచితంగా.!
*శ్రీవారికి భారీ విరాళం.. ఆనవాయితీ కొనసాగించిన అశోక్ లేలాండ్
తిరుమల శ్రీవారిని భక్తులు మూడు విధాలుగా దర్శించుకుంటూ ఉంటారు. స్లాటెడ్ సర్వదర్శనం, దివ్య దర్శనం (నడక మార్గం), టోకెన్లు లేని సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. వీరందరికీ బీమా వర్తింపజేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకం ద్వారా భక్తులకు మరింత భద్రత కల్పించాలనేది టీటీడీ లక్ష్యం. ఈ బీమా పథకం ద్వారా శ్రీవారి భక్తులు మరింత సురక్షితంగా తమ యాత్రను కొనసాగించవచ్చు.
*తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా!
అయితే శ్రీవారి భక్తులకు ఉచిత బీమా సౌకర్యం ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలు అమలై శ్రీవారి భక్తులకు టీటీడీ ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.