Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»వణికిపోతున్న హిమాచల్.. భారీ వర్షాలకు 31 మంది మృతి.. 53 రోడ్లు మూసివేత.. మరోసారి ఆరెంజ్ అలర్ట్!
తాజా వార్తలు

వణికిపోతున్న హిమాచల్.. భారీ వర్షాలకు 31 మంది మృతి.. 53 రోడ్లు మూసివేత.. మరోసారి ఆరెంజ్ అలర్ట్!

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వణికిపోతున్న హిమాచల్.. భారీ వర్షాలకు 31 మంది మృతి.. 53 రోడ్లు మూసివేత.. మరోసారి ఆరెంజ్ అలర్ట్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వరుణుడు అలిగాడనుకున్నాడు. రుతుపవనాలు ప్రవేశించినా అలకపాన్పు దిగలేదని ఆందోళనపడ్డారు. కానీ తెలుగు స్టేట్స్‌లో మిస్టర్‌ వరుణ్‌ ఎంట్రీ లేట్‌ అయిందిగానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే కుమ్మేస్తున్నాడు. సీజన్ స్టార్టింగ్‌ నుంచే కొన్నిచోట్ల విశ్వరూపం చూపిస్తున్నాడు. మొన్నటిదాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి. కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తర భారతం.

ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ 20న రుతుపవనాలు వచ్చినప్పటి నుండి జూన్ 27 వరకు హిమాచల్‌లో 31 మంది మరణించారు. నలుగురు తప్పిపోయారు, 66 మంది గాయపడ్డారు. ఇందులో పాము కాటు, నీటిలో మునిగిపోవడం, రోడ్డు ప్రమాదాలు, నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తుల గణాంకాలు ఉన్నాయి.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వారం రోజుల్లో రూ.29.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) అత్యధికంగా రూ.2 కోట్ల 743.40 లక్షల నష్టం వాటిల్లింది. 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, 8 దెబ్బతిన్నాయి. 7 దుకాణాలు, 8 గోశాలలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. 37 జంతువులు, ఎన్నో పక్షులు కూడా కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 53 రోడ్లు ట్రాఫిక్ కోసం మూసివేశారు. దీంతో పాటు, 135 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 147 తాగునీటి పథకాలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది ప్రజల జీవితాలు ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో గరిష్ట నష్టం కులు జిల్లాలో నమోదైంది. ఇక్కడ 23 రోడ్లు మూసివేశారు.

#WATCH | Himachal Pradesh: Heavy rainfall triggered a flash flood in Dharamshala earlier today. Vehicles stuck & submerged in water while people struggle to walk on the road. Visuals from the Bhagsu Nag area. pic.twitter.com/Oz6gAK3xHw

— ANI (@ANI) July 12, 2021

నిర్మండ్, అని సబ్ డివిజన్లలో నీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 74 ట్రాన్స్‌ఫార్మర్లు, 118 తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. మండి జిల్లాలో 16 రోడ్లు మూసివేశారు. 59 ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం లేదు. కిన్నౌర్‌లో 33 తాగునీటి పథకాలు ప్రభావితమయ్యాయి. ఇక, జూలై 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జూన్ 29న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 24 గంటల్లో సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని, జాగ్రత్తగా వహించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

28 June 2025

Male Fertility: పురుషుల సంతానోత్పత్తికి పెనుముప్పు.. ఈ 3 అలవాట్లే దెబ్బేస్తున్నాయి..

28 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మూడు దశలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల కోసం…

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025

Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

28 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.