Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Annadata Sukhibhava Funds Release,అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు.. – ap cm chandrababu said annadata sukhibhava funds release with pm kisan yojana on july

29 June 2025

తన జీవిత భాగస్వామిపై అంత ద్వేషమా? మహిళను 25 సార్లు పొడిచి చంపిన వ్యక్తి!

29 June 2025

Asia Cup 2025: ఆసియా కప్ సమరానికి ముహూర్తం ఫిక్స్! భారత్- పాక్ మ్యాచ్‌ జరుగుతుందా? క్లారిటీ ఇదిగో

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Robbery Attempt In Visakha Express,Guntur: సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడికి యత్నం.. దొంగల ముఠాపై రైల్వే పోలీసులు కాల్పులు – robbery attempt foiled by railway police in visakha express at new piduguralla station
ఆంధ్రప్రదేశ్

Robbery Attempt In Visakha Express,Guntur: సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడికి యత్నం.. దొంగల ముఠాపై రైల్వే పోలీసులు కాల్పులు – robbery attempt foiled by railway police in visakha express at new piduguralla station

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Robbery Attempt In Visakha Express,Guntur: సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడికి యత్నం.. దొంగల ముఠాపై రైల్వే పోలీసులు కాల్పులు – robbery attempt foiled by railway police in visakha express at new piduguralla station
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీకి యత్నించగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ ముఠాలపై నిఘా పెట్టారు.

హైలైట్:

  • ఆందోళనకు గురిచేస్తోన్న సిగ్నల్ ట్యాంపరింగ్ ఘటనలు
  • 48 గంటల వ్యవధిలో న్యూపిడుగురాళ్లలో రెండో ఘటన
  • అనంతపురంలో చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌‌లో దోపిడీ
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు (ఫోటోలు– Samayam Telugu)

భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వస్తోన్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైల్లో దుండుగులు దోపిడీకి ప్రయత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూపిడుగురాళ్ల స్టేషన్ సమీపంలో సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేసి రైల్లోకి ప్రవేశించిన గ్యాంగ్‌‌పై రైల్వే పోలీసులు కాల్పుల జరిపారు. దీంతో దుండగులు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠా రైల్లోకి ఎక్కినట్టు పోలీసులు తెలిపారు. బిహార్, మహారాష్ట్రలకు చెందిన ముఠాలు రైల్లో దోపిడీకి పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో న్యూపిడుగురాళ్ల స్టేషన్‌లో జరిగిన రెండో ఘటన ఇది. శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి చర్లపల్లికి వస్తోన్న స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి.. లోపలికి ప్రవేశించి ప్రయాణికుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. దీంతో రైలును లోకోపైలట్ ఆపవలసి వచ్చింది. ఆ తరువాత దొంగలు రెండు బోగీల్లోకి వెళ్లి మహిళల మెడల్లోని బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సిగ్నల్‌ వ్యవస్థను ట్యాంపర్‌ చేయడం ద్వారా రైలును నిలిపివేశారు.. తెల్లవారుజామున 4.12 గంటల నుంచి 5.30 వరకు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’అని చెప్పారు. దొంగలు ఒక మహిళ దగ్గర 20 గ్రాముల గొలుసు, మరొక మహిళ దగ్గర 30 గ్రాముల గొలుసు దోచుకున్నారని తెలిపారు.

సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దొంగతనాలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఒంగోలు, రేణిగుంట, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల స్టేషన్ల పరిధిలో ఇదివరకే ఇలాంటి ఘటనలు జరిగాయి. మూడు రోజుల కిందట అనంతపురం జిల్లాలో చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి మహిళ మెడలోంచి 2.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌కు చెందిన ముఠాలే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు రైళ్లలో దొంగతనాలు రైలు క్రాసింగ్ కోసం ఆగినప్పుడు లేదా ప్రయాణికుల్లా నటిస్తూ చేసేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీల నుంచి చేతులు పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి రైళ్లు ఆపేసి దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో షోలాపూర్ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్‌లతో పాటు జామ్‌కేడ్, బీడ్‌ ప్రాంతాలకు చెందిన నేరస్థులు ఉన్నారని రైల్వే పోలీసులు గుర్తించారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి