కొన్నాళ్ల క్రితం దువ్వాడ కుటుంబం పేరు మారుమోగింది. ఇప్పుడు దువ్వాడ వాణి టెక్కలి సమస్యలపై ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. సర్పంచ్లను తొలగించడం, ఉపాధి హామీ సిబ్బందిని తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, అధికారులు స్పందించే వరకు దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె దీక్షకు దిగడానికి అసలు కారణం ఏంటి.. అరు వివరాలు తెలియాలంటే..
హైలైట్:
- దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు
- ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటన
- కారణమిదే

టెక్కలి మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని.. మౌలిక వసతుల నిర్వహణ దిగజారిపోయిందని దువ్వాడ వాణి తెలిపారు. అధికారులు ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని దువ్వాడ వాణి ప్రకటించారు. పంచాయతీ, మండల పరిషత్ నిధులను వాటికి కేటాయించిన ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. టెక్కలిలో 196 హుదూద్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని దువ్వాడ వాణి కోరారు. ఈ సమస్యలు పరిష్కరించకపోత తాను ఆమరణ దీక్ష చేస్తానంటూ వాణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
భార్యాభర్తలుగా, వైసీపీ లీడర్లుగా దువ్వాడ శ్రీనివాస్, వాణిలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంచి క్రేజ్ ఉండేది. రాజకీయాలపరంగా చూసుకుంటే ఇద్దరూ సీనియర్ నాయకులే. ఇద్దరికీ పాలిటిక్స్లో అనుభవం ఉంది. దువ్వాడ వాణి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్గా కూాడా పనిచేశారు. ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమెది రాజకీయ కుటంబం.
ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే!
భర్తతో విబేధాలు ముగిసిన తర్వాత.. ప్రస్తుతం దువ్వాడ వాణి వైసీపీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆమెకు సముచితమైన గౌరవం దక్కుతుంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ యాక్టీవ్గా ఉంటున్నారు. వైసీపీ తరఫున టెక్కలిలో చురుగ్గా పని చేస్తున్నారు. అవకాశం అదృష్టం కలిసి వస్తే.. వచ్చే ఎన్నికల్లో దువ్వాడ వాణి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలుస్తోంది.