బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా-100 2025 నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 100 కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సాంకేతికత, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, హాస్పిటాలిటీ సహా వివిధ రంగాల్లో ప్రధాన భారతీయ బ్రాండ్లకు స్థిరమైన లాభాల నేపథ్యంలో ర్యాంకింగ్స్ ఇచ్చింది. టాటా గ్రూప్ బ్రాండ్ విలువలో 30 బిలియన్ డాలర్లను దాటిన మొదటి భారతీయ బ్రాండ్గా అవతరించింది. ఈ కంపెనీ బ్రాండ్ వాల్యూ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా టాటా కంపెనీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తి వంటి పరిశ్రమల్లో తన హవా చూపుతుంది. ఈ ర్యాంకింగ్స్లో టాప్ 10 బ్రాండ్లు మొత్తంగా బలమైన రెండంకెల వృద్ధిని చూపించాయి. ఇన్ఫోసిస్, ఇప్పుడు 15 శాతం పెరుగుదల తర్వాత 16.3 బిలియన్ల డాలర్లకు చేరుకుని, దేశంలో రెండో అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. ఈ కంపెనీ ఐటి సేవల రంగంలో ముందంజలో ఉంది.
అలాగే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం తరువాత హెచ్డీఎఫ్సీ గ్రూప్ 37 శాతం పెరిగి 14.2 బిలియన్ డాలర్లకు చేరుకుని, మూడో స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ 35 శాతం పెరిగి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది నాలుగో స్థానంలో ఉండగా హెచ్సీఎల్టెక్ 17 శాతం పెరుగుదలతో 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మహీంద్రా గ్రూప్ 9 శాతం పెరిగి 7.2 బిలియన్ డాలర్లకు, లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) గ్రూప్ 3 శాతం పెరిగి 7.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హైటెక్ తయారీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక వనరుల్లో ఎల్ అండ్ టీ విస్తరించడంతో ఈ స్థాయిలో నిలవడానికి సాయం పడింది.
అదానీ గ్రూప్ అన్ని ర్యాంక్ బ్రాండ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. దాని బ్రాండ్ విలువను 82 శాతం పెంచింది. అదాని గ్రూ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడుల వల్ల అధి స్థాయిలో వృద్ధి సాధించిందని నివేదికలో వెల్లడైంది. బ్రాండ్ బలం పరంగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో సంవత్సరం బలమైన భారతీయ బ్రాండ్గా తన స్థానాన్ని నిలుపుకుంది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు 100 కి 92.2 తో, దాని ఏఏఏ+ రేటింగ్ను నిలుపుకుంది. ఏసియా పెయింట్స్ 92 స్కోరుతో, అమూల్ 91.2 స్కోరుతో దగ్గరగా ఉన్నాయి. ఈ రెండూ కూడా ఏఏఏ+ రేటింగ్స్ పొందాయి.
ఇవి కూడా చదవండి
జొమాటో సంస్థ కూడా మొదటిసారిగా టాప్ 100లోకి ప్రవేశించింది, 1 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 39వ స్థానంలో నిలిచింది. 48 వ స్థానంలో ఉన్న పెర్సిస్టెంట్ సిస్టమ్స్, 33 శాతం పెరుగుదలను 811 మిలియన్ డాలర్లకు నమోదు చేసింది. ఇది భారతీయ ఐటీ సేవల బ్రాండ్లలో అత్యధికంగా ఉంది. బిర్లాసాఫ్ట్ కూడా తన రంగంలో 164 మిలియన్ డాలర్ల విలువతో ర్యాంకింగ్స్లోకి ప్రవేశించింది. 656 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో హెచ్ఎంఈఎల్ ఏడు స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరుకుంది. ఇంజనీరింగ్ సంస్థ జెట్వెర్క్ దాని విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి