Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Amit Shah: మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

30 June 2025

Lord Shiva: సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఎలా పూజ చేయాలి? ఏ రాశివారు ఏమి సమర్పించడం ఫలవంతం అంటే..

30 June 2025

Ntr Bharosa Pension Scheme In Eligibility,ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, లెక్క తేలినట్లే! – ntr bharosa pension scheme number of ineligible people receiving disability pensions has reached one lakh reports

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Apsrtc Student Bus Pass Online,రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం – apsrtc provides free bus passes to stundents with 50 rupees per year
ఆంధ్రప్రదేశ్

Apsrtc Student Bus Pass Online,రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం – apsrtc provides free bus passes to stundents with 50 rupees per year

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Apsrtc Student Bus Pass Online,రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం – apsrtc provides free bus passes to stundents with 50 rupees per year
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Free Bus Pass for Students in Andhra Pradesh: విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి వరకూ బాలికలకు, ఆరో తరగతి వరకూ బాలురకు ఉచితంగా బస్సు పాసులు అందిస్తున్నారు. ఆపైన నిర్ణీత రుసుంతో బస్సు పాసులను ఏపీఎస్ఆర్టీసీ మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో బస్ పాస్ ఎలా పొందాలనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం
రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం (ఫోటోలు– Samayam Telugu)

స్కూళ్లు, కాలేజీలు మొదలైపోయాయి. విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు పరుగులు తీస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత వాహనాలలో కాలేజీలు, స్కూళ్లకు వెళ్తుంటే.. ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థులకు బస్ పాస్‌లు జారీ చేస్తోంది. ఉచిత బస్సు పాసులతో పాటుగా కొంత రుసుముతో కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్‌లు అందిస్తోంది. బాలికలకు పదో తరగతి వరకూ ఉచిత బస్సు పాసులు అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. నామమాత్రమైన 50 రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటుగా బస్సులలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. ఇక బాలురకు అయితే ఆరో తరగతి వరకూ ఉచిత బస్సు పాస్ సౌకర్యం అందుబాటులో ఉంది.
అలాగే ఇంటర్మీడియట్ చదివే బాలికలు, ఏడో తరగతి నుంచి బాలురు బస్ పాసుల కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దూరాన్ని అనుసరించి ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక విశాఖపట్నం సంగతికి వస్తే.. ప్రతి విద్యార్థికి మూడు నెలలకు ఓసారి బస్ పాస్ మంజూరు చేస్తారు. రూ.935 చెల్లిస్తే, మూడు నెలలు విశాఖలోని సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించేలా బస్ పాస్ ఇస్తారు. మూడు నెలల తర్వాత మళ్లీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ ఉన్న విద్యార్థులు మెట్రో బస్సులలో ప్రయాణించాలంటే రూ.10 చెల్లించి కాంబినేషన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం

మరోవైపు విశాఖపట్నంలో విద్యార్థుల కోసం రూట్ పాస్‌లు కూడా మంజూరు చేస్తున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించే విద్యార్థులకు ఈ రూట్‌పాస్‌లు అందిస్తున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలోని స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు రూ.395 చెల్లిస్తే మూడు నెలల పాటు చెల్లే బస్ పాస్ అందిస్తారు,. అలాగే 8 కిలోమీటర్ల పరిధిలో అయితే రూ.485 చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

బస్ పాస్‌ పొందటం ఎలా?

మరోవైపు విద్యార్థులు బస్ పాస్ పొందాలంటే.. వారు చదివే విద్యాసంస్థలు పూర్తి వివరాలతో జాబితాలను ఆర్టీసీ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్‌పాస్‌ దరఖాస్తులో తమ పూర్తి వివరాలు నింపి., ఆ దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. ఈ ప్రింట్‌తో పాటుగా కాలేజీ జారీ చేసే ధ్రువీకరణపత్రం, ఆధార్‌ జిరాక్స్‌ జత చేసి బస్‌స్టేషన్‌లో సమర్పించాలి. ఆర్టీసీ అధికారులు విద్యాసంస్థలు పంపిన జాబితాలో వివరాలు సరి చూసి పాస్‌ మంజూరు చేస్తారు. ఇక ఉచిత బస్ పాస్‌ కోసం అయితే స్కూలు హెచ్ఎం ధ్రువీకరించిన పత్రం, దరఖాస్తు ప్రింట్,ఆధార్‌కార్డు జిరాక్స్‌ సమర్పిస్తే సరిపోతుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి