ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఇటీవల విడుదల చేసింది. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.13000 చొప్పున విడుదల చేసింది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బులు విడుదల చేశారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశారు. అయితే తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన వారి కోసం ఇప్పుడు మరో సర్వే చేస్తున్నారు. థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేస్తు్న్నారు.

అయితే తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవటం మాత్రమే కాదు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు మరో పని చేయాల్సి ఉంటుంది. తల్లికి వందనం పథకం కింద రూ.13000 వచ్చినట్లు ఏపీ ప్రభుత్వానికి ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. తల్లికి వందనం నిధులు విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థ్యాంక్యూ సీఎం సార్ అంటూ సర్వే మొదలుపెట్టింది. థ్యాంక్యూ సీఎం సార్ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది. గ్రామాలను సందర్శిస్తారు. తల్లికి వందనం లబ్ధిదారుల ఇంటికి వచ్చి.. డబ్బులు జమ అయ్యాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఫేస్, ఐరిస్, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ వివరాలను నమోదు చేస్తారు.
అయితే థ్యాంక్యూ సీఎం సార్ సర్వేలో పాల్గొనడం ద్వారా లబ్ధిదారులకు తల్లికి వందనం డబ్బులు అందాయని ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. దీనివలన తదుపరి విడత డబ్బులు జమ చేయటంలో జాప్యం జరిగే అవకాశాలు ఉండవని సమాచారం.
తల్లికి వందనం డబ్బులు పడ్డాయా.. ఇలా తప్పక చేయండి!
థ్యాంక్యూ సీఎం సర్ సర్వే కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నారు. అలాగే బ్ధిదారుడి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా వివరాలను యాప్లో చూసి, ధృవీకరణ చేస్తున్నారు. ధృవీకరణ పూర్తయితే తల్లికి వందనం డబ్బులు జమైనట్లు ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏపీలో పలుచోట్ల ఈ థ్యాంక్యూ సీఎం సర్ సర్వే జరుగుతోంది.