Tirumala Chennai TVS Capital Funds Rs 51 Lakhs Donation: తిరుమల శ్రీవారికి తమిళనాడు భక్తుడు భారీ విరాళం అందజేశారు. టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ సంస్థ విద్యాదాన ట్రస్టుకు రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చింది. మరోవైపు, టీటీడీ జేఈవో కడప, ఒంటిమిట్ట ఆలయాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలాలయం ఏర్పాట్లు, మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, అన్నప్రసాదాల పంపిణీ పెంచాలని సూచించారు. ఈ ఆలయాల అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయం.
హైలైట్:
- తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
- టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ సంస్థ తరఫున
- చెక్కు టీటీడీ అడిషనల్ ఈవోకు ఇచ్చారు

దేవునికడప, ఒంటిమిట్ట ఆలయాలను పరిశీలించిన టీటీడీ జేఈవో
కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి టిటిడి జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. కడప, ఒంటిమిట్ట ఆలయాల పరిధిలో శనివారం ఆయన వేరువేరుగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. త్వరలోజరుగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ గర్భాలయంలో, పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు లేకుండా చూడాలని, విద్యుత్ పాత వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గర్భాలయంలో పైభాగాన ఉన్న కాలం చెల్లిన కొయ్య దంతెలను తొలగించే అంశం, ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు,
తిరుమల శ్రీవారి చెన్నై భక్తుడిది ఎంత గొప్ప మనసు.. పేద విద్యార్థుల కోసం, ఉచితంగానే
పోటు పెంపు, పీఏసీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్, నూతన వాహన మండపం, తదితర మరమ్మతుల పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను కోరారు. పుష్కరిణి వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పోరేషన్ అధికారులకు సూచించారు. అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి ఆలయం పరిసరాలలో జరుగుతున్న పనులపై జేఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు కనిపించేలా శంఖు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయం సమీపంలో 27 నక్షత్రాలు చెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంటిమిట్ట ఆలయ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.