Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: పడుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా?.. వంద రోగాలకు ఇదొక్కటే కారణం

30 June 2025

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతనికి బాగా తగించి ఏం చేశారంటే..?

30 June 2025

OTT Movie: సోషల్ మీడియాతో ఇంత దారుణమా? ఓటీటీలో సంచలనం రేపుతోన్నరియల్ థ్రిల్లింగ్ స్టోరీ.. మస్ట్ వాచ్ మూవీ

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Diet Charges Decision,ఏపీలో విద్యార్థులకు తీపికబురు.. డైట్ ఛార్జీల పెంపు, మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister savitha comments on diet charges hike
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Diet Charges Decision,ఏపీలో విద్యార్థులకు తీపికబురు.. డైట్ ఛార్జీల పెంపు, మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister savitha comments on diet charges hike

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Diet Charges Decision,ఏపీలో విద్యార్థులకు తీపికబురు.. డైట్ ఛార్జీల పెంపు, మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister savitha comments on diet charges hike
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Diet Charges Increase Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీలు పెరిగితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్‌లో డైట్ ఛార్జీల పెంపు
  • మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు
  • త్వరలోనే నిర్ణయం ఉంటుందని
ఏపీలో డైట్ ఛార్జీల పెంపుపై నిర్ణయం
ఏపీలో డైట్ ఛార్జీల పెంపుపై నిర్ణయం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్స్‌లో విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్‌ ఛార్జీల పెంపునకు సంబంధించి బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు తెలిపారు. డైట్ ఛార్జీల పెంపునకు కృషిచేస్తానని మంత్రి సవిత తెలిపారు.. ఈ ఛార్జీల పెంపు అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. డైట్ ఛార్జీల పెంపుపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు మంత్రి. డైట్ ఛార్జీలు కనుక పెంచితే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు.మంత్రి సవితను తాడేపల్లిలో హాస్టల్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారుల సంఘం ప్రతినిధులు.. ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి పలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాకాలం కాబట్టి హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు వసతి గృహాల్లో తాజాగా ఆహారం, కాచి చల్లార్చిన నీటిని అదించాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రంలో నాలుగో తరగతి ఉద్యోగాలతో పాటుగా హాస్టల్స్ అధికారుల పోస్టుల భర్తీ, ప్రమోషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు మంత్రి సవిత.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ హాస్టల్స్‌తో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ వంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలు అందిస్తుంది. అలాగే విద్యార్థినిలకు కాస్మోటిక్ ఛార్జీలు కూడా చెల్లిస్తారు. ఈ ఛార్జీలను నెలవారీగా వారికి అందజేస్తారు. ఈ మేరకు 2023-2024కు సంబందించి ఛార్జీలను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సవిత ఇప్పటికే ఛార్జీల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు.. త్వరలోనే పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు డైట్ ఛార్జీల పెంపు వంతు వచ్చింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి