Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ కొబ్బరి చెట్టు పిలక పాపను గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆమె హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

30 June 2025

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

30 June 2025

Dil Raju: 30 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నా.. నా బయోపిక్‌కు ఆ హీరో అయితే బాగుంటాడు: దిల్ రాజు

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Praises Teacher,ప్రభుత్వ టీచర్‌ వాసుదేవరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు.. ఇంతకీ ఎవరీ వాసు మాస్టారు – andhra pradesh minister nara lokesh praises government teacher
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Praises Teacher,ప్రభుత్వ టీచర్‌ వాసుదేవరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు.. ఇంతకీ ఎవరీ వాసు మాస్టారు – andhra pradesh minister nara lokesh praises government teacher

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Praises Teacher,ప్రభుత్వ టీచర్‌ వాసుదేవరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు.. ఇంతకీ ఎవరీ వాసు మాస్టారు – andhra pradesh minister nara lokesh praises government teacher
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh Praises Govt Teacher: ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయుడు వాసుదేవరావు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారు. విజయనగరం జిల్లా రాజాం సమీపంలోని డోలపేటకు చెందిన ఆయన గడిముడిదాం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నాలుగో తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం వాసుదేవరావును ప్రశంసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని ఆయన ఆకాంక్షించారు.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్ణయం
  • వాసుదేవరావుపై లోకేష్ ప్రశంసలు
  • ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై లోకేష్ ప్రశంసలు
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై లోకేష్ ప్రశంసలు (ఫోటోలు– Samayam Telugu)

ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసే రోజులివి.. ప్రభుత్వ స్కూళ్లు వద్దు, ప్రైవేట్ బడులే ముద్దు అంటూ ఎక్కువశాతం తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థలవైపుగా పరుగులు తీస్తున్నారు. పిల్లల చదువుల కోసం లక్షల రూపాయల్ని ప్రైవేట్ స్కూళ్లకు చెల్లిస్తున్నారు. ఇక ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి చదివిస్తారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే కొంతమంది టీచర్లు మాత్రం ప్రైవేట్ స్కూళ్లు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటున్నారు.. వారి పిల్లల్ని తీసుకెళ్లి సర్కారీ బడుల్లో చేర్పిస్తున్నారు. ‘మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారు.. మీ పిల్లల్ని తీసుకొచ్చి చేర్చండి’ అంటూ సందేశాన్ని ఇస్తున్నారు.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా ఓ ఉపాధ్యాయుడు తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.. మంత్రి నారా లోకేష్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజాం సమీపంలోని డోలపేటకు చెందిన వాసుదేవరావు ప్రభుత్వ టీచర్. ఆయన ప్రస్తుతం గడిముడిదాం ప్రాథమికోన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన ఇద్దరు పిల్లల్ని తాను పనిచేసే బడిలోనే చేర్పించారు. వాసుదేవరావు కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది.. కుమారుడు డోలపేటలోని ఎంపీపీ స్కూల్లో రెండో క్లా్స్ చదువుతున్నాడు. ప్రజల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచేందుకు తన ఇద్దరు పిల్లల్ని ఇక్కడే చదవిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపాలని కోరుతున్నారు.

ప్రభుత్వ టీచర్‌ వాసుదేవరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు.. ఇంతకీ ఎవరీ వాసు మాస్టారు

హిందీ ఉపాధ్యాయుడు వాసుదేవరావుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం. తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు ఈ మాస్టారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్ కి అభినందనలు. మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం’ అంటూ వాసు మాస్టారుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. వాసుదేవరావు మాస్టారు మాత్రమే కాదు మరికొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని సర్కారీ బడుల్లోనే చేర్పిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి