Tiruchanur Car Dead Bodies Found: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో కారులో ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. రంగనాథం వీధిలో పార్క్ చేసిన కారులో వినయ్, దిలీప్ మృతదేహాలను గుర్తించారు. పోలీసులు బీర్ బాటిల్స్ ఆధారంగా ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుపై కవర్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
హైలైట్:
- తిరుచానూరులో మృతదేహాల కలకలం
- కారులో ఇద్దరు యువకుల డెడ్బాడీలు
- ఆ చిన్న పొరపాటు వల్లే చనిపోయారా?

కోల్పోయిన యువకుల్ని తిరుచానూరుకు చెందిన వినయ్, దీలీప్గా గుర్తించారు.. వారిద్దరు అన్నదమ్ములని సమాచారం. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారులో నాలుగు బీర్ బాటిల్స్ను గుర్తించారు.. ఈ ఇద్దరు యువకులు బీర్లు తాగిన మత్తులో కారులో ఏసీ వేసుకుని పడుకున్నట్లు భావిస్తున్నారు. ఇలా కారులో నిద్రిస్తున్న క్రమంలో.. కారులో పెట్రోల్ మొత్తం ఖాళీ కావడంతో.. ఇంజన్ ఆగిపోయి ఉంటుందని.. ఇద్దరు యువకులకు ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. యువకుల మృతిపై స్థానికులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులోపల యువకుల మృతదేహాలు ఉంటే.. కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ.. బయట నుంచి కవర్ ఎవరు కప్పి ఉంటారన్నది ఇప్పుడు అందరి మొదళ్లను తొలిచేస్తున్న అనుమానం.
ఆదివారం కాబట్టి.. ఎవరైనా చూస్తారేమో అని వాళ్లే బయట కవర్ కప్పుకుని లోపలికి వెళ్లి మద్యం సేవించి అందులోనే పడుకున్నారా.. లేదా ఎవరైనా కావాలనే యువకులను ప్లాన్ చేసి చనిపోయేలా చేశారా..? అనుకోకుండా మద్యం మత్తులో అందులో ఇరుక్కుపోయి వాళ్లే ప్రాణాలు కోల్పోయారా.. అలా కోల్పోతే బయటి నుంచి ఎవరు కవర్ కప్పి ఉంటారు.. అన్న అనుమానాలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ అనుమానాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉంది.. దీంతో పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకవేళ యువకులు కారులో ఇరుక్కుపోయి ఉంటే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారా లేదా అనేది క్లారిటీ లేదు. కారులో యువకుల్ని ఎవరూ గుర్తించలేకపోయారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుచానూరు తిరుమల కొండకు దిగువన తిరుపతికి దగ్గరలో ఉంటుంది. తిరుచానూరులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు.. అలాంటి చోట ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా?
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి. తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు.