Tirupati Police Alert Tirumala Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి పోలీసులు ముఖ్యమైన సూచనలు చేశారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తిరుపతిలో కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనివల్ల వాహనాల ఇంజన్ వేడి తగ్గుతుంది, డ్రైవర్లకు నిద్ర మత్తు వదులుతుంది. రాత్రి దర్శనం పూర్తయితే తిరుపతిలో విశ్రాంతి తీసుకుని ఉదయం ప్రయాణం చేయడం మంచిది. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేశారు.
హైలైట్:
- తిరుమల వచ్చే భక్తులకు పోలీసుల అలర్ట్
- ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
- ఇటీవల ఘటనలతో భక్తుల్ని అలర్ట్ చేశారు

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పోలీసుల కీలక సూచనలు
ఒకవేళ ఎవరైనా భక్తులకు రాత్రి సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం పూర్తైతే.. వారు తిరుపతిలో ఆగి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు కోరారు. రాత్రి వేళల్లో శ్రీవారి దర్శనం పూర్తికాగానే.. త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందర వద్దన్నారు. నిద్రమత్తులో వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఇలా నిద్రమత్తులో హడావిడిగా వెళ్లి రోడ్డు ప్రమాదాలబారిన పడ్డారని గుర్తు చేశారు. భక్తులు నిదానంగా సురక్షితంగా వెళ్లాలని సూచించారు. తిరుమలకు వచ్చే వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. తిరుమలలో ఆదివారం కర్ణాటకకు చెందిన భక్తుల కారులో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. సో తిరుమలకు వచ్చే భక్తులు ఈ సూచనలు పాటించండి.