
రుతుపవనాల ఆగమనంతో ప్రకృతి పచ్చదనం సంతరించుకుంది. పర్వతాలు, లోయలు, జలపాతాలు సరికొత్త అందాలు అద్దుకుంటున్నాయి. వాన చినుకుల సవ్వడులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అయితే, ఈ అందాల వెనుక కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు మూసుకుపోవడం వంటివి ప్రయాణాలను ఇబ్బందికరంగా మారుస్తాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లడం ఈ వానాకాలంలో అంత సురక్షితం కాదు. మరి, ఈ రుతుపవనాల్లో మీరు తప్పక నివారించాల్సిన ప్రదేశాలు ఏవి? ఎందుకు వెళ్లకూడదు? పూర్తి వివరాలు చూద్దాం.
తప్పక నివారించాల్సిన ప్రదేశాలు:
పర్వత ప్రాంతాలు, ట్రెకింగ్ మార్గాలు: వానాకాలంలో కొండచరియలు విరిగిపడటం, దారులు జారడం వంటివి సర్వసాధారణం. ఉదాహరణకు, ఉత్తరాఖండ్లోని రూపకుండ్, పిండారి గ్లేసియర్, కేదార్కాంత జూలై-ఆగస్టు నెలల్లో మూసివేస్తారు. ఈ ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరం.
జోజిలా పాస్, రోహ్తంగ్ పాస్: లడఖ్ వెళ్లే దారిలో ఈ పాస్లు ఉన్నాయి. జూలైలో భారీ వర్షాల వల్ల బురద కొట్టుకువచ్చి దారులు మూసుకుపోతాయి.
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్: వానాకాలంలో ఈ ప్రాంతం బురదమయంగా మారి, దోమల బెడద ఎక్కువ అవుతుంది. బోట్ సఫారీలకు అంతరాయం కలుగుతుంది.
జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోని జలపాతాలు: వర్షాకాలంలో జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తాయి. నదులు, వాగులలో ప్రవాహం పెరుగుతుంది, ఇది ప్రమాదకరంగా మారుతుంది.
గోవా: జల క్రీడలకు ప్రసిద్ధి చెందిన గోవాలో జూలైలో భారీ వర్షాలు కురుస్తాయి. బీచ్లలో ఈత కొట్టడం, వాటర్ స్పోర్ట్స్ ఆడటంపై ఆంక్షలు విధిస్తారు. చాలా షాక్లు, క్లబ్లు మూసి ఉంటాయి. వానాకాలంలో ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా ఉండాలని అధికార