Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బీట్‌రూట్‌ ఆకులు పడేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

3 July 2025

స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలు.. ఆపై 7 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే.. టీమిండియా ప్లేయర్‌కు.!

3 July 2025

Bigg Boss : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‏బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd On False Hotel Prices In Tirumala,తిరుమలలో భక్తులకు రూ.10కే టిఫిన్, రూ. 19కే బిర్యానీ, రూ.30కే భోజనం.. అసలు సంగతి ఇదా! – dont believe false messages on hotel prices in tirumala circulating on social media says ttd
ఆంధ్రప్రదేశ్

Ttd On False Hotel Prices In Tirumala,తిరుమలలో భక్తులకు రూ.10కే టిఫిన్, రూ. 19కే బిర్యానీ, రూ.30కే భోజనం.. అసలు సంగతి ఇదా! – dont believe false messages on hotel prices in tirumala circulating on social media says ttd

.By .2 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd On False Hotel Prices In Tirumala,తిరుమలలో భక్తులకు రూ.10కే టిఫిన్, రూ. 19కే బిర్యానీ, రూ.30కే భోజనం.. అసలు సంగతి ఇదా! – dont believe false messages on hotel prices in tirumala circulating on social media says ttd
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Hotel Prices False Messages: తిరుమలలో హోటళ్ల ధరలు తగ్గాయంటూ ఓ ధరల పట్టింక వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. హోటళ్లలో ఆహార ధరలు తగ్గించారనే వార్తల్లో నిజం లేదని, ఇది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని భక్తులకు సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ అధికారికంగా ప్రకటించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది.

హైలైట్:

  • తిరుమల హోటల్స్‌లో ధరలు తగ్గింపు
  • సోషల్ మీడియా వేదికగా ఓ పట్టిక వైరల్
  • స్పందించిన టీటీడీ.. క్లారిటీ ఇచ్చారు
తిరుమల హోటల్స్ ధరలపై స్సష్టత
తిరుమల హోటల్స్ ధరలపై స్సష్టత (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి నిత్యం భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం వసతిగదులతో పాటుగా ఉచితంగా అన్నప్రసాదం కూడా అందిస్తోంది. కొందరు భక్తులు మాత్రం కొండపై ఉన్న ప్రైవేట్ హోటల్స్, రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. టీటీడీ అద్దె ప్రాతిపదికన ఈ హోటల్స్‌ను ప్రవేట్ వ్యక్తులకు కేటాయిస్తుంది. అయితే ఈ ప్రైవేట్ హోటల్స్‌ ధరల విషయంలో టీటీడీ నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది.. అక్కడ భక్తులకు అందుబాటు ధరల్లోనే ఆహారం అందించాలని నిబంధన ఉంది. టీటీడీ అధికారులు, విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ్ అధికారులు అప్పడప్పుడు తనిఖీలు చేస్తుంటారు.. ఆహారం నాణ్యతో పాటుగా హోటల్స్, రెస్టారెంట్లలో పరిశుభ్రత.. ధరల్ని పరిశీలిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అధిక ధరలకు విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇటీవల కాలంలో టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలు స్వయంగా తనిఖీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తిరుమలలో హోటల్స్‌లో ధరలు తగ్గించారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘తిరుమల కోండపై హోటళ్లలో నేటినుంచి క్రింద కనబరచిన ధరలకన్నా ఎక్కువ ధర ఎవరైనా వసూలు చేసినచో ఈ నంబరుకి 18004254141 తెలియజేయండి.. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం’ అంటూ కొందరు ట్వీట్‌లు చేశారు. తిరుమలలోని హోటల్స్‌లో ధరలు తగ్గించిటన్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. ‘తిరుమల కొండపై ఉన్న పెద్ద హోటల్స్ 17, చిన్న హోటల్స్ 8, చిరుతిళ్ల షాపులు (ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు) సుమారు 150, చిరు దుకాణాలు 30’ ఉన్నాయన్నారు.

‘గతంలో రెండు ఇడ్లీ ధర రూ.25 ఉండేదని, ఇప్పుడు దానిని రూ.7.50.. రెండు చపాతి ధర గతంలో రూ.60 ఉండేదని, ఇప్పుడు రూ.20కు.. టీ గతంలో రూ.15 ఉంటే, ఇప్పుడు దానిని రూ.5.. వెజిటబుల్ బిర్యానీ గతంలో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.19.. ఉప్మా గతంలో రూ.20 ఉంటే, ఇప్పుడు దానిని రూ.9.. ప్లేట్ మీల్స్ గతంలో రూ.60 ఉంటే ఇప్పుడు రూ.22.50.. ఫుల్ మీల్స్ గతంలో రూ.100 ఉంటే ఇప్పుడు రూ.31’ మాత్రమే అంటూ ఓ ధర పట్టికను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పట్టికపై చర్చ జరుగుతోంది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం క్యూ అవసరం లేదు

తిరుమలలోని హోటల్స్‌లో ధరలు తగ్గించారంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. తిరుమలలోని హోటల్స్‌లో ఫుడ్ ధరలు తగ్గించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది టీటీడీ. ఇలాంటి వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని తెలిపింది. ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది టీటీడీ. ‘ఇలాంటి తప్పుడు వార్తలు, ప్రచారంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను గందరగోళానికి గురి చేయొద్దని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తిరుమల శ్రీవారి భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org, టీటీడీ కాల్ సెంటర్ 18004254141 ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో అనుమానాస్పద సమాచారాన్ని షేర్‌ చేయొద్దు’ అని తెలిపింది టీటీడీ. మొత్తం మీద ఈ ధరల అంశంపై క్లారిటీ వచ్చేసింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి