Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అను ఇమ్మాన్యుయేల్ గుర్తుందా.? సినిమాలు లేవు కానీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

3 July 2025

Viral Video: విమానం గాల్లో ఉండగా ఊహించని సీన్… భయాందోళనలో ప్రయాణికులు

3 July 2025

ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి .. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that moderate rains today in these districts
ఆంధ్రప్రదేశ్

Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి .. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that moderate rains today in these districts

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి .. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that moderate rains today in these districts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Weather Updates: వాతావరణ శాఖ హెచ్చరిక! ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉండవచ్చు. మరి ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి!

హైలైట్:

  • బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం
  • ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
  • ప్రజల్ని అలర్ట్ చేసిన వాతావరణశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడతాయంటోంది వాతావరణశాఖ. జార్ఖండ్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ద్రోణి రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.’బుధవారం రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని.. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు ఏపీలో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.

Saraswati Sugar Mill: కొంపముంచిన వర్షం.. కరిగిపోయిన కోట్ల విలువైన చక్కెర!

‘రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, వైఎస్సార్‌ కడప, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇది బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం. ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది ప్రభుత్వం.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి