Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ramayana: గూస్ బంప్స్ తెప్పిస్తున్న రామాయణ.. మూడు నిమిషాల లోనే మోత మోగించారు

3 July 2025

Tomato: టమోటా తింటున్నారా..? గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు రోగాలన్నీ పరార్‌..!

3 July 2025

Bobbili: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ntr Bharosa Pension Scheme 2025,ఏపీలో వారి పింఛన్‌లు కట్.. ఈ విషయం తెలుసుకోండి, కాకపోతే మరో ఛాన్స్ ఉంది – andhra pradesh government focus on ntr bharosa pension scheme eligible people receiving disability quota
ఆంధ్రప్రదేశ్

Ntr Bharosa Pension Scheme 2025,ఏపీలో వారి పింఛన్‌లు కట్.. ఈ విషయం తెలుసుకోండి, కాకపోతే మరో ఛాన్స్ ఉంది – andhra pradesh government focus on ntr bharosa pension scheme eligible people receiving disability quota

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ntr Bharosa Pension Scheme 2025,ఏపీలో వారి పింఛన్‌లు కట్.. ఈ విషయం తెలుసుకోండి, కాకపోతే మరో ఛాన్స్ ఉంది – andhra pradesh government focus on ntr bharosa pension scheme eligible people receiving disability quota
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లలోని అవకతవకలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వం హయాంలో నిబంధనలు పాటించకుండా అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 7.86 లక్షల పింఛన్లను పరిశీలించగా లక్ష మందికి పైగా అనర్హులుగా తేలారు. పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయని, తక్కువగా కాకినాడలో ఉన్నాయని గుర్తించారు. తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందిన 50 వేల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి, సదరం సర్టిఫికెట్ల కోసం నోటీసులు జారీ చేశారు.

హైలైట్:

  • ఏపీలో బోగస్ పింఛన్‌లపై ఫోకస్ పెట్టారు
  • కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి
  • మరో అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ పింఛన్ అనర్హులపై వేటు
ఏపీ పింఛన్ అనర్హులపై వేటు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో బోగస్ పింఛన్‌ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్లలో భారీగా అవకతవకలు జరిగాయని తేలింది.. పింఛన్ల విషయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వీరికి దివ్యాంగులకు ఉండాల్సిన అర్హతలు లేవని.. అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో మొత్తం 7.86 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 175 నియోజకవర్గాల్లో 4.76 లక్షల పింఛన్లను తనిఖీ చేయగా.. సుమారు లక్ష మంది అనర్హులుగా తేలారు. అయితే అనర్హుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎక్కువమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు గుర్తించారట. ఈ మేరకు ప్రభుత్వం వారందరు సదరంలో తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి.. అన్నటికంటే తక్కువగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 19 బోగస్ పింఛన్లు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా బోగస్ పింఛన్లు ఉన్నాయి.. మొత్తం 13 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 1,300 వరకు బోగస్ పింఛన్లు.. 88 నియోజకవర్గాల్లో 500 నుంచి 970 మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. మిగిలిన 59 నియోజకవర్గాల్లో 100 నుంచి 500 మధ్య బోగస్ పింఛన్లు ఉన్నాయి. అత్యల్పంగా చూస్తే.. విశాఖపట్నం దక్షిణంలో 39, తాడికొండలో 55, విశాఖ ఉత్తరంలో 57 బోగస్ పింఛన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వినికిడి లోపం, అంధత్వం, రేచీకటి లేకపోయినా, చేతులు కాళ్లు వంకర్లు లేకపోయినా సరే ఉన్నట్లుగా పత్రాలను సృష్టించి పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. వీరంతా తప్పుడు సదరం సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించారు. మొత్తం 50,540 మంది తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని తేల్చారు. 23,200 మంది కంటి చూపు బావున్నా సరే.. సరిగా లేనట్లు సర్టిఫికెట్ పొంది.. 20వేలమంది చెవుడు లేకున్నా ఉన్నట్లు బోగస్ పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 5.10 లక్షల మంది దివ్యాంగుల కేటగిరిలో ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాల కోసం నోటీసులు ఇచ్చారు.. తనిఖీలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ 5.10 లక్షలమందిలో 4.76 లక్షల మంది వైద్యులు మాత్రమే తనిఖీలకు వచ్చారు. తనిఖీలకు రాని మిగిలిన వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తామంటున్నారు అధికారులు. ఒకవేళ అప్పటికీ రాకపోతే చర్యలు తప్పవంటున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కేటగిరిలో పింఛన్‌లు పొందుతున్నవారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది.. ఈ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి