Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

13 July 2025

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Simhachalam Giri Pradakshina: 32 కిలోమీటర్ల సింహాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం.. అప్పన్న సన్నిధిలో లక్షలాది భక్త జన సంద్రం
ఆంధ్రప్రదేశ్

Simhachalam Giri Pradakshina: 32 కిలోమీటర్ల సింహాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం.. అప్పన్న సన్నిధిలో లక్షలాది భక్త జన సంద్రం

.By .9 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Simhachalam Giri Pradakshina: 32 కిలోమీటర్ల సింహాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం.. అప్పన్న సన్నిధిలో లక్షలాది భక్త జన సంద్రం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నం, జులై 9: గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రారక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. గతంలో అనుభవాల నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక ఆషాడ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. 32 కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే కలిగే భాగ్యమే వేరని భక్తులు నమ్ముతూ ఉంటారు. సింహాచలేశ్వరుడు కొలువుదిరిన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అందుకే ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కాలినడకన 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు.

ఈ రోజు (జులై 9) సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి గిరిప్రదక్షిణం ప్రారంభమైంది. స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్త జనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. తొలిపావంచా నుంచి మొదలైన ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్ బి కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలయ్యశాస్త్రి లే అవుట్, పోర్టు స్టేడియం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుని ప్రదక్షిణ ముగుస్తుంది.

భక్తుల గిరి దక్షిణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రము. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఇనప దిమ్మలు సిద్ధం చేశారు. దారి పొడవునా వాలంటీర్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాద వితరణ తాగునీరుతో పాటు.. టాయిలెట్ల సదుపాయం కల్పించారు. అలాగే వైద్య శిబిరాలు పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ సమయంలో పుణ్యా స్థానాలు చేయడం అనవయతి. ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటికే అధికార యంత్రంగం తో హోం మంత్రి అనిత సమీక్ష చేశారు.

ఇవి కూడా చదవండి

గిరి ప్రదక్షణ ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులను కొండ దిగువకు చేర్చేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. 50 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలోని 29 ప్రాంతాల్లోని ప్రత్యేక స్టాళ్లలో విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలు, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ప్రత్యేకంగా సింహాచలం వెల్లి అక్కడే పరిస్థితులపై సమీక్ష చేసి అధికారులకు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న ఆలయ ప్రదక్షణ, చంద్రన్న సమర్పణ ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 10న సింహాద్రినాథుడికి చివరి విడత చందన సమర్పణ చేస్తారు. ఆరోజు వేకువజామున 2 గంటలకే సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన మూడు మణుగుల చందనం అంటే.. సుమారు 125కిలోలు శ్రీగంధాన్ని స్వామికి సమర్పణ చేస్తారు.

32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణకు భక్తులకు నేటి నుంచి అవకాశం కల్పిస్తారు. వేకువజామున 3 గంటల నుంచి ఆలయ వెలుపల నుంచి భక్తులు ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఉత్తర గోపురం, దక్షిణ గోపురం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులు కూడా అక్కడ పరిస్థితులు ఏర్పాట్లకు తగ్గట్టుగా సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

గుడ్‌న్యూస్.. అమరావతిలో రూ.2,200 కోట్లతో బిట్స్‌ క్యాంపస్ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన కేఎమ్‌ బిర్లా!

13 July 2025

Amaravati Bits Pilani Campus,BITS Pilani in AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి.! – bits pilani plans to setup ai campus in amaravati with 1000 crore

13 July 2025

Bobbili Veena: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు.. ఓన్ డిస్ట్రిక్ట్ ఓన్ ప్రొడక్ట్‌గా ఎంపిక

13 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025

మోకాలి నొప్పిని ఫస్ట్ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజంగానే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బాడీకి సేఫ్ అయిన…

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

13 July 2025

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

13 July 2025

Mountain Places: ఈ పర్వత ప్రాంతాలు అద్భుతాలకు నిలయం.. కచ్చితంగా చూడాల్సిందే..

13 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

13 July 2025

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

13 July 2025

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

13 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.