Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Shubman Gill : గర్ల్ ప్రెండ్ పేరు అడగ్గానే శుభమన్ గిల్ ఏమన్నాడో తెలుసా.. అభిషేక్ శర్మ వీడియో వైరల్

13 July 2025

Amaravati Landless Poor Pension,ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. నెలకు రూ.5000! – ap government decides to provide pensions to 1575 more landless families in amaravati

13 July 2025

Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Sabari Express Converted Into Superfast Express,తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌‌గా మార్పు.. రైలు నంబర్, బయల్దేరే టైమింగ్స్ మారాయి – railway board decides to convert thiruvananthapuram secunderabad sabari express 17229 into superfast express
ఆంధ్రప్రదేశ్

Sabari Express Converted Into Superfast Express,తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌‌గా మార్పు.. రైలు నంబర్, బయల్దేరే టైమింగ్స్ మారాయి – railway board decides to convert thiruvananthapuram secunderabad sabari express 17229 into superfast express

.By .9 July 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sabari Express Converted Into Superfast Express,తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌‌గా మార్పు.. రైలు నంబర్, బయల్దేరే టైమింగ్స్ మారాయి – railway board decides to convert thiruvananthapuram secunderabad sabari express 17229 into superfast express
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Sabari Express Converted Into SuperFast: రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరువనంతపురం-సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైలు నంబర్లను మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేయనున్నారు. రైళ్లలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను తిరిగి అప్పగించేందుకు ‘ఆపరేషన్ అమానత్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

హైలైట్:

  • రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
  • ఆ ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్‌గా మార్పు
  • కొత్త నంబర్లు కేటాయించిన రైల్వేశాఖ
శబరి ఎక్స్‌ప్రెస్ రైలు టైమింగ్స్ మార్పు
శబరి ఎక్స్‌ప్రెస్ రైలు టైమింగ్స్ మార్పు (ఫోటోలు– Samayam Telugu)

రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడిచే రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. తిరువనంతపురం-సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ మారినట్లు రైల్వే బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కొత్త నంబర్లు 20630/20629గా కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు తిరువనంతపురంలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరుతుంది.. తమిళనాడు మీదుగా ఏపీలోకి, ఆ తర్వాత తెలంగాణలోకి వస్తుంది. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మరుసటి రోజు ఉదయం 11 గంటలకే సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది క్లారిటీ లేదు.. త్వరలో వివరాలు ప్రకటిస్తారు. అయితే శబరి రైలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.05 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఇప్పుడు ఆ సమయాల్లో కూడా మార్పులు చేశారు.

ఈ రైలు ఏపీలోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.. త్వరలోనే ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడిస్తారు.

శ్రీశైలం నుంచి సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు.. జలహారతి ఇచ్చిన సీఎం

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని గమనించి.. ఎనిమిది రైళ్లకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని జత చేస్తున్నారు. జులై 13, 14 తేదీల నుంచి ఏసీ బోగీ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ (12711, 12712), సికింద్రాబాద్‌-గుంటూరు, గుంటూరు – సికింద్రాబాద్ (17201, 17202), సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (17233, 17234), విజయవాడ-కాచిగూడ, కాచిగూడ-విజయవాడ (12713, 12714) రైళ్లకు అదనపు బోగీ ఉంటుంది. అంతేకాదు ప్రయాణికులు రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో మొబైల్స్ పోగొట్టుకుంటే వాటిని అప్పగించేందుకు ‘ఆపరేషన్‌ అమానత్‌’ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గత నెలలో ఏకంగా 140 ఫిర్యాదులు వచ్చాయి.. 25 మొబైల్స్ గుర్తించి.. అందులో 14 ప్రయాణికులకు అందజేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి