Andhra Pradesh Parents Teachers Mega Meeting Guinness Book Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది! ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ ఈ సమావేశంలో ఏం జరగబోతోంది? విద్యార్థుల భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యమవుతుంది?
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు దిశగా అడుగులు
- ఒకే రోజు ఏకంగా 2 కోట్ల మందితో మెగా ఈవెంట్
- హాజరుకానున్న చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

గతేడాది తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం అయ్యింది.. దీంతో ఈ ఏడాది పటీఎం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇకపై ప్రతి ఏటా పండుగ వాతావరణంలో మెగా పీటీఎంలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పిల్లలకు సంబందించి ప్రోగ్రెస్ కార్డుల్ని కూడా తల్లిదండ్రులకు అందజేస్తారు. అలాగే ప్రధానంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది.
ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభంకానుంది. ‘విద్యార్థుల సంక్షేమం, అభ్యసనా సామర్థ్యాల పెంపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు, పొందుతున్న లబ్ధి తదితర అంశాలపై సమీక్ష.మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైం, సోషల్ మీడియా అంశాలపై అవగాహన కల్పించడం. ఆటల పోటీలు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమావేశం. అమ్మపేరుపై మొక్కనాటడం (4నుంచి టెన్త్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం) వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు’ అని తెలిపారు.
డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఒక్కమాటలో తేల్చేసిన నారా లోకేష్
‘గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఉదయం పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడినుంచి పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్కు వెళ్తారు. అక్కడ మెగా పీటీఎం అనంతరం చంద్రబాబు పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయం చేరుకుని విజయవాడకు బయలుదేరి వెళ్తారు’అని సీఎం షెడ్యూల్ ప్రకటించారు.