Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Four New Airports Hudco Loan,ఏపీలో మరో నాలుగు కొత్త ఎయిర్‌పోర్ట్‌‌లు.. రూ. వెయ్యి కోట్లకు గ్రీన్ సిగ్నల్, ఈ జిల్లాలకు మహర్దశ – andhra pradesh four new airports likely to get hudco loan rs 1000 crores
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Four New Airports Hudco Loan,ఏపీలో మరో నాలుగు కొత్త ఎయిర్‌పోర్ట్‌‌లు.. రూ. వెయ్యి కోట్లకు గ్రీన్ సిగ్నల్, ఈ జిల్లాలకు మహర్దశ – andhra pradesh four new airports likely to get hudco loan rs 1000 crores

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Four New Airports Hudco Loan,ఏపీలో మరో నాలుగు కొత్త ఎయిర్‌పోర్ట్‌‌లు.. రూ. వెయ్యి కోట్లకు గ్రీన్ సిగ్నల్, ఈ జిల్లాలకు మహర్దశ – andhra pradesh four new airports likely to get hudco loan rs 1000 crores
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh New Airports Hudco Loan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి విమానాశ్రయాల అభివృద్ధి కోసం హడ్కో నుండి రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. ఒంగోలు, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీకి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో విమాన తయారీ సంస్థ ఏర్పాటుకు సరళ ఏవియేషన్ ప్రతిపాదనలు చేసింది.

హైలైట్:

  • ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు
  • అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి
  • హడ్కో నుంచి రూ.1,000 కోట్ల రుణం
ఏపీ కొత్త ఎయిర్‌పోర్టులకు నిధులు
ఏపీ కొత్త ఎయిర్‌పోర్టులకు నిధులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టులపై ఫోకస్ పెట్టింది.. భూ సేకరణతో పాటుగా ఇతర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల కోసం నిధులు సమీకరించే పనిలో ఉంది. రాష్ట్రంలోని అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకుంటోంది. రాష్ట్ర విమానాశ్రయాభివృద్ధి సంస్థ రూ.1,000 కోట్ల రుణం కోసం హడ్కోను సంప్రదించగా.. సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ క్రమంలో ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రుణంతో విమానాశ్రయాల అభివృద్ధికి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఒంగోలు, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకుటెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (TEFR) తయారు చేయడానికి ఆసక్తి గల సంస్థల కోసం ప్రకటన జారీ చేసింది.. 29లోగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే రాష్ట్రంలో విమాన తయారీ సంస్థను ఏర్పాటు చేస్తామని సరళ ఏవియేషన్ మంత్రి బీసీ జనార్దనరెడ్డికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిశారు. పైలట్ శిక్షణ సంస్థ గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు కూడా మంత్రిని కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో శిక్షణ కేంద్రాన్ని (గోల్డెన్ ఎపలెట్స్ ఏవియేషన్ అకాడమీ విద్యార్థులకు పైలట్ శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని) ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సీఎం కారులో.. సీఎంతో కలిసి.. దళితుడి ప్రయాణం

ఎయిర్‌ టాక్సీల తయారీ సంస్థ సరళ ఏవియేషన్, డేటా సెంటర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ సంస్థ, గోల్డెన్ ఎపలెట్స్ ఏవియేషన్ అకాడమీ, హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సరళ ఏవియేషన్ సంస్థ ఎయిర్‌ టాక్సీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. కంట్రోల్ ఎస్ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. రాడార్, GPS పరికరాలు, నేవిగేషన్ వ్యవస్థలు తయారు చేసే హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి