Andhra Pradesh Garividi Veterinary College Good News: విజయనగరం జిల్లాలోని గరివిడి వెటర్నరీ కాలేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. కాలేజీ శాశ్వత సభ్యత్వాన్ని కొనసాగించడానికి అంగీకరించింది. చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు చొరవతో అనుమతులు పునరుద్ధరించబడ్డాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనుమతులు రద్దయ్యాయని వారు తెలిపారు. కాలేజీలో అన్ని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి లలన్ సింగ్ హామీ ఇచ్చారు.
హైలైట్:
- ఏపీకి కేంద్రం నుంచి మరో గుడ్న్యూస్
- ఆ విద్యార్థులందరికి ఊరట దక్కింది
- ఆ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుగా

నాకు చికెన్ పెట్టండి.. నేను తింటాను: మంత్రి అచ్చెన్నాయుడు
‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యపాలన, సహకార, మార్కెటింగ్ శాఖల గౌరవ మంత్రి శ్రీ కింజరాపు అచ్చన్నాయుడు గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారి తో కలిసి, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖల మంత్రి శ్రీ లాలన్ సింగ్ గారిని కలిసాం. తోతాపురి మామిడి కొనుగోలుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పధకం కింద మద్దతు, అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా శ్రీకాకుళం తీరప్రాంతంలో మత్స్యకారుల కోసం మౌలిక వసతుల అభివృద్ధికి వినతిపత్రాలు సమర్పించాము. గరివిడి పశువైద్య కళాశాల మరియు దాని శాశ్వత సభ్యత్వ కొనసాగింపుకు సంబంధించిన అభ్యర్థనలను కూడా మేము సమర్పించాము. దీనికి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రులు మా యొక్క ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తాము అని హామీ ఇచ్చారు. రైతుల హక్కులను కాపాడటానికి, అవసరమైన సమయంలో రైతుల పక్షాన నిలిచి వారిని ఆదుకునేందుకు నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మొత్తం మీద గరివిడి వెటర్నరీ కాలేజీకి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి.