Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Funds Release To Farmers,ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్.. – ap government funds released paddy procurement pending dues to farmers
ఆంధ్రప్రదేశ్

Ap Govt Funds Release To Farmers,ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్.. – ap government funds released paddy procurement pending dues to farmers

.By .10 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Funds Release To Farmers,ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్.. – ap government funds released paddy procurement pending dues to farmers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Funds Release: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు శుభవార్త. ధాన్యం బకాయిల డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. గురువారం 30 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 660 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రబీ, ఖరీఫ్ సీజన్‌లో ఎంతమొత్తంలో ధాన్యం సేకరించాం, ఎంతమంది రైతులకు చెల్లింపులు చేశామనే వివరాలను వెల్లడించారు.

ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్..
ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్.. (ఫోటోలు– TIMESOFINDIA.COM)

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం బకాయిల డబ్బులను ఏపీ ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లో ఏపీ పౌర సరఫరాల సంస్థ 2,01,934 రైతుల వద్ద నుంచి 4575.32 కోట్ల విలువైన 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన మంత్రి.. ఏపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు బకాయిల కోసం గురువారం (జూలై 10) రూ.659.39 కోట్ల రూపాయలు.. 30,403 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

2024-2025 సీజన్‌లో ఇప్పటి వరకూ 4575.32 కోట్ల రూపాయలు.. 2,01,934 రైతుల ఖాతాలో జమ చేశామని.. వంద శాతం రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమచేసినట్లు వెల్లడించారు. 2021-22 రబీ సీజన్‌లో 2,29,248 రైతుల నుంచి రూ. 26,23,535 కోట్లు విలువైన 5,099.62 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని.. 2022-23 రబీ సీజన్‌లో 1,58,784 రైతుల నుంచి రూ. 2,884.04 కోట్లు విలువైన 14,12,881 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని వెల్లడించారు. 2023 -24 రబీ సీజన్‌లో 1,32,859 రైతుల నుంచి రూ.2,763.86 కోట్లు విలువగల 12,64,845 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారన్నారు.

ఇక ఖరీఫ్ సీజన్ విషయానికి వస్తేృ 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 5,65,662 మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు, దీని విలువ రూ.8282.27 కోట్లు. 5,65,662 మంది రైతులకు మొత్తం రూ.8282.27 కోట్లు చెల్లంచినట్లు మంత్రి వివరించారు. మొత్తం 24.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించినట్లు తెలిపారు. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో 5,79,403 రైతుల నుంచి రూ. 7,846.13 కోట్లు విలువైన 40,31,652 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని..2022-23 ఖరీఫ్ సీజన్‌లో 6,39,510 రైతుల నుంచి రూ.7,222.10 కోట్లు విలువైన 35,36,136 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని నాదెండ్ల మనోహర్ వివరించారు. 2023-24 ఖరీఫ్ కాలంలో 4,97,907 రైతుల నుంచి రూ. 6,549.15 కోట్లు విలువైన 29,97,063 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని వివరించారు.

ఏం తమాషాగా ఉందా.. రైతులు నీ దగ్గరకు రావాలా: మంత్రి నాదెండ్ల ఆగ్రహం

మరోవైపు వైసీపీ ప్రభుత్వం చెల్లించని ధాన్యం బకాయిలు రూ.1674.47 కోట్లు కూడా.. 84,724 మంది రైతుల ఖాతాల్లో జమచేశామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి