Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‎లో భారత్ హవా.. రెండు ఫార్మాట్లలో టీమిండియా టాప్!

31 July 2025

Tollywood: మాములు రేంజ్ కాదు భయ్యో.. రెండేళ్లల్లో 400 కోట్లు సంపాదించిన హీరోయిన్.. సినిమాలతో కాదు..

31 July 2025

Sleeping Problems: రాత్రుల్లో నిద్ర పడటం లేదా? మధ్యలో ఆకస్మాత్తుగా లేస్తున్నారా? ఈ టిప్ప్‌ పాటించండి!

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP News: రాజకీయ అస్త్రంగా మామిడి రైతు గోస.. ధర పతనానికి కారణం అదేనా..?
ఆంధ్రప్రదేశ్

AP News: రాజకీయ అస్త్రంగా మామిడి రైతు గోస.. ధర పతనానికి కారణం అదేనా..?

.By .11 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP News: రాజకీయ అస్త్రంగా మామిడి రైతు గోస.. ధర పతనానికి కారణం అదేనా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మామిడి ధర.. ఇప్పుడు రచ్చగా మారింది. ఏపీలో రాజకీయాన్ని రంజుగా మార్చింది. మద్దతు ధర అందకపోవడంతో రోడ్డెక్కిన రైతాంగం సమస్య రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మామిడి ధర పతనానికి అసలు కారణమేంటి. మామిడి రైతుకు ఎందుకింత కష్టం వచ్చిందన్న దానికంటే మ్యాంగో ఫైట్ చేస్తున్న పొలిటికల్ పార్టీలదే పెద్ద సమస్యగా మారింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లే… చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం కష్టాలకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా మామిడి ధరలు పతనం కావడంతో కంటతడి పెడుతున్న రైతాంగం పండిన పంటను అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పాటు ఈ ఏడాది దిగుబడి అమాంతంగా పెరగడంతో మామిడి కొనేవారు కరువయ్యారు. దీంతో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతాంగం సమస్య రాజకీయ అస్త్రంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోగా రైతుకు మాత్రం తీపి పంట చేదుగానే మిగిలిపోయింది. అసలు ఈ ఏడాది ఎందుకు మామిడి రైత కు ఎప్పుడూ లేనంత కష్టం వచ్చిందన్న విషయాలను ఆరా తీస్తే అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడిపై ఉద్యానవన శాఖ ఇస్తున్న లెక్కలను పరిశీలిస్తే కారణాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లలో మామిడి సాగు జరగా ఈ ఏడాది దిగుబడి 8.40 లక్షల టన్నుల మామిడి దిగుబడి జరిగింది. గతేడాది 56 వేల హెక్టార్ల లోనే మామిడి సాగు ఉండగా దిగుబడి మాత్రం దాదాపు 3.35 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది హెక్టార్‌కు 6 టన్నుల మామిడి దిగుబడి రాగా, ఈ ఏడాది హెక్టారు కు 15 టన్నుల మామిడి దిగుబడి అయింది. రైతు ఊహించనంత దిగుబడి రావడానికి వాతావరణ పరిస్థితులు కూడా ఏడాది అనుకూలించాయి. మరోవైపు ఏప్రిల్ మే వరకు వర్షాలు రావడంతో మామిడి సైజు విపరీతంగా పెరిగింది. మామూలుగా 350 నుంచి 400 గ్రాముల బరువు తో దిగుబడి వచ్చే మామిడి ఈ ఏడాది 700 నుంచి 750 గ్రాముల వరకు కాయ సైజు పెరిగింది. దీంతో హెక్టారుకు రెండింతల నుంచి మూడింతల దాకా దిగుబడి పెరిగింది.

ఇక మామిడి ధర విషయంలోనూ గతేడాదికి ఏడాది ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. గతేడాది టన్ను తోతాపూరి మామిడి రకం రూ. 22 నుంచి 26 వేల దాకా రైతులకు లభించింది. అయితే ఈ ఏడాది టన్ను ధర రూ. 10 వేలు కూడా అందరి పరిస్థితి నెలకొంది. పల్ప్ పరిశ్రమలు టన్నుకు రూ. 6 వేల దాకా ఇస్తుంటే ప్రభుత్వం ప్రోత్సాహక ధరగా టన్నుకు రూ.4 వేలు చెల్లిస్తోంది. ఈ లెక్కన టన్ను తోతాపూరి మామిడి కి రూ. 10 వేలు ధర దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చిత్తూరు జిల్లాలో మార్కెట్ యార్డ్‌ల వద్ద ర్యాంప్‌లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు టన్ను ధర రూ.3 వేలకు మించి ఇవ్వక పోవడంతో రైతుకు గిట్టుబాటు ధర అందడం లేదు. మరోవైపు పల్ప్ యాజమాన్యాలు టన్ను మామిడికి రూ. 8 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. నష్టాలను సాకుగా చూపి టన్ను కు రూ.6 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే రేటు కూడా ఇచ్చి కొనుగోలు చేయని పల్ప్ యాజమాన్యాల తీరు రైతులకు సంకటంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక ధర కూడా రైతుల ఖాతాలకు చేరకపోవడంతో రైతుకు మద్దతు ధర గాలిలో దీపంగా మారింది.

ఇక మరో కారణం రాష్ట్రంలో అన్నిచోట్ల ఒకేసారి మామిడి సీజన్ ప్రారంభం కావడం. గతేడాది ముందుగా కృష్ణ ఆ తరువాత ఇతర జిల్లాల నుంచి మామిడి దిగుబడి రాగా ఈ ఏడాది అంతటా ఒకేసారి మామిడి రైతు చేతికి అందింది. ఇక ఈ ఏడాది మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలపైనా అనేక విమర్శలు రాగా మామిడి రైతుకు సరైన ధర లభించక పోవడానికి పల్ప్ యూనిట్ యాజమాన్యాలు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 44 పల్ప్ ప్రాసెస్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 39 యూనిట్లు మాత్రమే మామిడి గుజ్జు తయారీ చేశాయి. గతేడాది పల్ప్ పరిశ్రమల్లో తయారైన మామిడి గుజ్జు ఎక్స్పోర్ట్ కాకపోవడంతో పెద్ద ఎత్తున నిల్వలు ఉండడం కూడా ఒక కారణం అయ్యింది. రూ. కోట్ల విలువచేసే పల్ప్ పరిశ్రమంలోనే ఉండిపోవడంతో ఈ ఏడాది ప్రాసెస్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ఏటా మే 20 తరువాత పల్ప్ యూనిట్లు ప్రాసెసింగ్ ప్రారంభిస్తుండగా ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా జూన్ 7 న గుజ్జు పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో ఒకేసారి మామిడి దిగుబడి రావడం, రైతులు పల్ప్ ఇండస్ట్రీస్ కు మామిడిని విక్రయించేందుకు ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. దిగుబడికి తగ్గట్టుగా డిమాండ్ లేకపోవడం కూడా సమస్యగా మారిపోయింది.

చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా 2.42 లక్షల టన్నుల మామిడి పల్ప్ యూనిట్లు కొనుగోలు చేయగా ఇంకా పొలాల్లోనే 1.48 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉండిపోయింది. జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. మరో రెండు వారాల్లో మామిడి సీజన్ ముగుస్తుండగా.. ఇప్పటికీ పల్ప్ పరిశ్రమల వద్ద అమ్మకానికి మామిడి ట్రాక్టర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు, మామిడి కొనుగోలులో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే గతంలో ఎప్పుడూ లేనట్లు మామిడి రైతుకు ప్రోత్సాహక ధర కల్పించిన ప్రభుత్వం తమదని టిడిపి చెబుతోంది. అధికార విపక్షాల మధ్య మ్యాంగో వార్ పీక్స్ కు చేరుకుంటుండగా మద్దతు ధర విషయంలో మాత్రం మామిడి రైతులకు సమస్య గానే మిగిలింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Senior Citizen Card Apply Free,ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త.. ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి – andhra pradesh government provides senior citizen card service free of cost without paying any application fees

31 July 2025

ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన.. భారీగా తరలివచ్చిన జనాలు!

31 July 2025

Tirumala Gold Dollars Case,తిరుమల శ్రీవారి బంగారు డాలర్ల కేసు.. 15మంది టీటీడీ అధికారులకు ఊరట.. 2006నాటి కేసు, కీలక ఉత్తర్వులు – andhra pradesh government orders on tirumala missing gold dollar case

31 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‎లో భారత్ హవా.. రెండు ఫార్మాట్లలో టీమిండియా టాప్!

31 July 2025

ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ఏకంగా ఐదుగురు భారత…

Tollywood: మాములు రేంజ్ కాదు భయ్యో.. రెండేళ్లల్లో 400 కోట్లు సంపాదించిన హీరోయిన్.. సినిమాలతో కాదు..

31 July 2025

Sleeping Problems: రాత్రుల్లో నిద్ర పడటం లేదా? మధ్యలో ఆకస్మాత్తుగా లేస్తున్నారా? ఈ టిప్ప్‌ పాటించండి!

31 July 2025

Statue Of Equality: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

31 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‎లో భారత్ హవా.. రెండు ఫార్మాట్లలో టీమిండియా టాప్!

31 July 2025

Tollywood: మాములు రేంజ్ కాదు భయ్యో.. రెండేళ్లల్లో 400 కోట్లు సంపాదించిన హీరోయిన్.. సినిమాలతో కాదు..

31 July 2025

Sleeping Problems: రాత్రుల్లో నిద్ర పడటం లేదా? మధ్యలో ఆకస్మాత్తుగా లేస్తున్నారా? ఈ టిప్ప్‌ పాటించండి!

31 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.