Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Fee Reimbursement In Ap 2025,ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల.. – ap government release 600 crore in fee reimbursement funds for students
ఆంధ్రప్రదేశ్

Fee Reimbursement In Ap 2025,ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల.. – ap government release 600 crore in fee reimbursement funds for students

.By .12 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Fee Reimbursement In Ap 2025,ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల.. – ap government release 600 crore in fee reimbursement funds for students
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Government fee reimbursement funds: రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. రూ.600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని.. ఇప్పుడు మరో రూ.600 కోట్లు.. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల..
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల.. (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు తీపికబురు వినిపించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గానూ అదనపు మొత్తం నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడతగా ఇప్పటికే రూ.788 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే మూడో విడతలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవటంతో ఫీజుల కోసం కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు చేసింది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేసేది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఈ విధానంలో మార్పులు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసేది. ఆ తర్వాత విద్యార్థుల తల్లులు ఫీజును కాలేజీలకు చెల్లించేలా మార్పులు చేశారు. ఆ తర్వాత విద్యార్థి – తల్లి జాయింట్ ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేస్తూ వచ్చారు.

అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ విధానంలో మార్పులు చేసింది. విద్యార్థుల తల్లులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని గ్రహించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాల అకౌంట్లలోకే జమ చేసేలా మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓసారి 788 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి రూ.600 కోట్లు నిధులు విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి