ఇంట్లోకి నీరు రావడం గమనించి వెంటనే అందరినీ నిద్రలేపాడు. చుట్టుపక్కలవారిని కూడా అప్రమత్తం చేశాడు. వారంతా వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. వారు ఆ ప్రాంతాన్ని వీడిన కాసేపటికే గ్రామంపై కొండచరియ విరిగిపడింది. నాలుగైదు ఇళ్లు తప్ప పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన వారు గత ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషాదం కారణంగా అనేక మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్లో వరదల ధాటికి దాదాపు 78 మంది మరణించారు. వీరిలో 50 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా మరణించగా, 28 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో
అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో
రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో
ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!