Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kingdom Collections: దుమ్మురేపిన కింగ్‏డమ్ కలెక్షన్స్.. రికార్డ్స్ కొల్లగొట్టిన విజయ్..

1 August 2025

Tirumala Devotee Donated Rs 25 Lakhs,తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. భక్తుల ఆకలి తీర్చేందుకు పెద్ద మనసుతో – tirumala hyderabad devotee srikanth donates rs 25 lakhs to sri venkateswara anna prasadam trust

1 August 2025

Food Poisoning: అల్లువచ్చాడని మందు మాంసంతో పార్టీ చేసుకున్నారు.. చికెన్ తిన్న ఇద్దరు మృతి.. ముగ్గురు పరిస్థితి విషమం..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్

Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు

.By .30 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని శ్రీ‌వాణి టికెట్లను కొనుగోలు చేసి స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులకు వసతి సమస్య రాకుండా ప్రయత్నిస్తోంది. శ్రీవాణి ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న దర్శన సమయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మార్పు చేసింది. ఏ రోజుకు ఆ రోజు శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు పొందే భ‌క్తులకు అదే రోజు దర్శనం కల్పించనుంది.
తిరుమలలో ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు ప్రకటించింది. తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశం నిర్వహించిన టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తిరుమ‌ల‌లో వ‌స‌తి గృహాల‌పై భారం త‌గ్గించేందుకు ప్రయత్నం చేస్తున్న టిటిడి.. ఆగ‌స్టు 1 నుంచి నూత‌న విధానం అమ‌లు చేయనుంది. తిరుమ‌ల‌లో ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు శ్రీవాణి టికెట్ల‌ను జారీ చేయనుంది. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు జారీ చేయనుంది. తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్ర‌యంలో 200 టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు మాత్రం య‌థావిధిగానే ఉద‌యం 10 గంట‌ల‌కే దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. న‌వంబ‌ర్ 1వ నుండి ఆఫ్ లైన్, ఆన్ లైన్ శ్రీ‌వాణి టికెట్ల‌ను పొందిన భ‌క్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద సాయంత్రం 4.30 లకు రిపోర్టింగ్ సమయం కేటాయిస్తోంది. శ్రీవాణి టికెట్ ల ద్వారా టిటిడి కి రోజు రూ. కోటిన్నర ఆదాయం వస్తుండగా ఏటా దాదాపు రూ. 500 కోట్లు వస్తోంది.
శ్రీవాణి దర్శన సమయంలో మార్పు పై తీసుకున్న నూతన విధానం ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టిటిడి భావిస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పడుతున్నట్లు టీటీడీ గుర్తించింది. దీంతో వసతిఇబ్బంది, సమయం వృధా కాకుండా ఉండేందుకు కొత్త ఆలోచనకు టీటీడీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నూతన విధానం తో భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతోందని భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Devotee Donated Rs 25 Lakhs,తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. భక్తుల ఆకలి తీర్చేందుకు పెద్ద మనసుతో – tirumala hyderabad devotee srikanth donates rs 25 lakhs to sri venkateswara anna prasadam trust

1 August 2025

కన్న కూతురునే చెరపట్టాలని చూసిన కసాయి తండ్రి కేసులో కోర్టు సంచలన తీర్పు..!

1 August 2025

Konaseema 30 Feet Digging,కోనసీమ: ఓ ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వారు.. కారణం తెలిసి వణికిపోయిన జనాలు – 30 feet digging in a house near kothapeta konaseema district

1 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kingdom Collections: దుమ్మురేపిన కింగ్‏డమ్ కలెక్షన్స్.. రికార్డ్స్ కొల్లగొట్టిన విజయ్..

1 August 2025

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ మాస్…

Tirumala Devotee Donated Rs 25 Lakhs,తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. భక్తుల ఆకలి తీర్చేందుకు పెద్ద మనసుతో – tirumala hyderabad devotee srikanth donates rs 25 lakhs to sri venkateswara anna prasadam trust

1 August 2025

Food Poisoning: అల్లువచ్చాడని మందు మాంసంతో పార్టీ చేసుకున్నారు.. చికెన్ తిన్న ఇద్దరు మృతి.. ముగ్గురు పరిస్థితి విషమం..

1 August 2025

కంత్రీపని చేసిన డ్రాగన్‌ కంట్రీ.. భగ్గుమన్న భారత్‌.. దెబ్బకు తోక ముడవాల్సి వచ్చింది..!

1 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kingdom Collections: దుమ్మురేపిన కింగ్‏డమ్ కలెక్షన్స్.. రికార్డ్స్ కొల్లగొట్టిన విజయ్..

1 August 2025

Tirumala Devotee Donated Rs 25 Lakhs,తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. భక్తుల ఆకలి తీర్చేందుకు పెద్ద మనసుతో – tirumala hyderabad devotee srikanth donates rs 25 lakhs to sri venkateswara anna prasadam trust

1 August 2025

Food Poisoning: అల్లువచ్చాడని మందు మాంసంతో పార్టీ చేసుకున్నారు.. చికెన్ తిన్న ఇద్దరు మృతి.. ముగ్గురు పరిస్థితి విషమం..

1 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.