Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Akividu Digamarru 165 National Highway New DPR,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే.. కొత్త డీపీఆర్ – akividu digamarru 165 national highway govt officials focus on new dpr
ఆంధ్రప్రదేశ్

Akividu Digamarru 165 National Highway New DPR,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే.. కొత్త డీపీఆర్ – akividu digamarru 165 national highway govt officials focus on new dpr

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Akividu Digamarru 165 National Highway New DPR,ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే.. కొత్త డీపీఆర్ – akividu digamarru 165 national highway govt officials focus on new dpr
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Akividu Digamarru 165 National Highway DPR Update: ఆంధ్రప్రదేశ్‌లో ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణ అంచనా వ్యయం రూ.2500 కోట్లకు చేరింది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో అంచనాలు పెరిగాయి. రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. పాలకొల్లు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎత్తును పెంచారు. కొత్త అంచనాలతో డీపీఆర్ సిద్ధమవుతోంది. కేంద్రం ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లు పిలుస్తారు. మార్చిలోపు ఆమోదం రాకుంటే ప్రతిపాదన మొదటికి వస్తుంది.

హైలైట్:

  • ఏపీలో కొత్త నేషనల్ హైవే అప్డేట్
  • కొత్తగా హైవే అంచనాలు పెరిగాయి
  • త్వరలోనే కేంద్రానికి కొత్త డీపీఆర్
ఆకివీడు దిగమర్రు నేషనల్ హైవే 165
ఆకివీడు దిగమర్రు నేషనల్ హైవే 165 (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన నేషనల్ హైవే నిర్మాణానికి అంచనాలు పెరిగాయి. ఆకివీడు – దిగమర్రు మధ్య జాతీయ రహదారిని నిర్మించడానికి గతంలో రూ.2400 కోట్లు అనుకున్నారు.. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో పెరిగిన అంచనాలకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. హైవే నిర్మాణంలో కొన్ని మార్పులు చేశారు.. దానిని నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అంచనాలు పెరిగాయంటున్నారు. ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి ప్రాజెక్టుకు గతంలో రూ.2400 కోట్లతో అంచనాలు వేయగా.. తాజాగా మరో రూ.100 కోట్లు పెరిగింది. దీంతో కొత్త అంచనాలతో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) మళ్లీ సిద్ధం చేస్తున్నారు. ఆకివీడు, కాళ్ల, భీమవరం రూరల్ మండలాల మీదుగా ఈ హైవే కొత్త అలైన్‌మెంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ హైవేలో పాలకొల్లు వద్ద ఆర్‌వోబి (రైల్వే ఓవర్ బ్రిడ్జ్) నిర్మించాల్సి ఉంటుంది.. మొదట ఏడు మీటర్ల ఎత్తులో ఆర్‌వోబి అనుకున్నారు.. కానీ కొత్త నిబంధనల ప్రకారం 8 మీటర్లు ఉండాలని కేంద్రం చెప్పింది. అందుకే దాన్ని సరిచేసి కొత్తగా డీపీఆర్ పంపారు.

Chandrababu: కుర్రాడికి క్లాస్ పీకిన చంద్రబాబు.. మంత్రిని చూపిస్తూ, ఆసక్తికర సీన్

అంతేకాదు ఈ హైవేకు సంబంధించి సిమెంట్, స్టీలు, మెటల్, కూలీల ఖర్చులను లెక్కిస్తున్నారు.. ధరలు పెరగడంతో వాటిని బట్టి కొత్త అంచనాలు వేస్తున్నారు. అలాగే కేంద్రం కొత్తగా కొన్ని మార్పులు చెప్పడంతో అంచనా వ్యయం పెరిగింది. ఈ క్రమంలో వ్యయం రూ.2500 కోట్లకు పెరిగింది. ఈ మేరకు మరో వారంలో కొత్త DPRను కేంద్రానికి పంపనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లు పిలుస్తారు.. ఒకవేళ మార్చిలోపు టెండర్లకు ఆమోదం రాకపోతే, ఈ ప్రతిపాదన మొదటికి వస్తుంది అంటున్నారు.
వాస్తవానికి ఈ హైవేను రెండు లైన్లుగా నిర్మించాలని భావించారు.. కానీ ఆ తర్వాత నాలుగు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త DPR ఆమోదంపై కేంద్రమంత్రి వర్మ దృష్టి పెడతారని భావిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలో మార్పులు చేసి పంపుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి