Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో

2 August 2025

Nara Lokesh Attended To Devansh Ptm,కొడుకుగా ఆ వెలితి.. తండ్రిగా తీర్చేసుకున్నాడు.. శభాష్ మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh attended to devansh parent teacher meeting

2 August 2025

CBSE Supplementary 2025 Results: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!
తెలంగాణ

ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కాళేశ్వరం కమిషన్‌ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. 650 పేజీలకు పైగా తుది నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాకు అందజేశారు కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ చంద్రఘోష్‌. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై కమిషన్‌ విచారించింది. నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 119 మందిని విచారించారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని పరిశీలించింది. కమిషన్ నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రధానంగా మూడు అంశాలను కమిషన్‌ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేయడం.. హైలెవల్‌ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్‌ రిలీజ్‌ చేసిట్లు నివేదికలో ప్రస్తావించారు. IASలు, ఇంజినీర్ల మధ్య సమన్వయం లోపం.. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్‌ తేల్చింది. మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేర్వేరుగా పొందుపర్చింది కమిషన్. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంగా కమిషన్ చీఫ్, జస్టిస్ పినాకి చంద్రఘోష్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ విచారణలో తన పాత్ర ముగిసిందన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఏమీ లేవన్నారు. కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది రిపోర్ట్ ఉందన్నారు. రిపోర్ట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలీదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో.. అటు ప్రభుత్వ, ఇటు రాజకీయ వర్గాల్లో తర్వాత ఏం జరగబోతుందని తీవ్ర చర్చనీయాశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

CBSE Supplementary 2025 Results: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

2 August 2025

Hyderabad: TFI అభిమానులకు షాక్.. ఇకపై థియేటర్స్‌ వద్ద ఆ పనులు చేస్తే జైలుకే!

2 August 2025

Telangana: కూలీలతో కలిసి ట్రాక్టర్‌తో పొలం దున్ని నాటు వేసిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన రైతులు!

2 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో

2 August 2025

మీ ఫోన్ సిగ్నల్ సరిగా లేకుంటే, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి 10-15 సెకన్ల తర్వాత.. మళ్లీ ఆన్‌ చేయండి.…

Nara Lokesh Attended To Devansh Ptm,కొడుకుగా ఆ వెలితి.. తండ్రిగా తీర్చేసుకున్నాడు.. శభాష్ మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh attended to devansh parent teacher meeting

2 August 2025

CBSE Supplementary 2025 Results: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

2 August 2025

అమ్మ బాబోయ్‌..! రెస్టారెంట్‌ వద్ద చుక్కలు చూపించిన ఫైథాన్‌ వీడియో

2 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో

2 August 2025

Nara Lokesh Attended To Devansh Ptm,కొడుకుగా ఆ వెలితి.. తండ్రిగా తీర్చేసుకున్నాడు.. శభాష్ మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh attended to devansh parent teacher meeting

2 August 2025

CBSE Supplementary 2025 Results: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

2 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.