Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ ఆకు ఎక్కడ దొరికితే అక్కడ నమిలేయండి.. వర్షాకాలంలో ఇదో వరం..

2 August 2025

Anshu Ambani: కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా చేస్తున్న ముద్దుగుమ్మ.. అన్షు అదరగొట్టిందిగా..!!

2 August 2025

Astro Tips: అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా.. ఈ మూగ జీవులకు రోజూ ఆహారాన్ని అందించండి..

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Donot Give Annadata Sukhibhava In Election Area,ఏపీలోని ఈ 6 జిల్లాల్లో రైతులకు బ్యాడ్‌న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వరు – dont give annadata sukhibhava scheme 2025 money in where elections are held in august
ఆంధ్రప్రదేశ్

Donot Give Annadata Sukhibhava In Election Area,ఏపీలోని ఈ 6 జిల్లాల్లో రైతులకు బ్యాడ్‌న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వరు – dont give annadata sukhibhava scheme 2025 money in where elections are held in august

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Donot Give Annadata Sukhibhava In Election Area,ఏపీలోని ఈ 6 జిల్లాల్లో రైతులకు బ్యాడ్‌న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వరు – dont give annadata sukhibhava scheme 2025 money in where elections are held in august
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Annadata Sukhibhava Scheme Election Districts: ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే కొన్ని జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. అందుకే ఆదేశాలు జారీ చేశారు.

హైలైట్:

  • ఏపీలో ఆ జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వరు
  • ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఆపాలని ఎన్నికల కమిషన్ ఆదేశం
  • ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ డబ్బుల్ని జమ చేయరు
అన్నదాత సుఖీభవ పథకం 2025
అన్నదాత సుఖీభవ పథకం 2025 (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవం పథకం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా స్థానికసంస్థల ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అకౌంట్లలో జమ చేయరు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతోపాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు, రెండు గ్రామాల పరిధిలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయొద్దన్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అందుకే డబ్బులు జమ చేయొద్దని ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నీలం సాహ్ని లేఖ రాశారు. అయితే ఎన్నికలు జరుగుతున్న చోట ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్‌ 20వ విడత నిధుల్ని మాత్రం విడుదల చేయొచ్చన్నారు. అంటే రూ.2వేలు అకౌంట్‌లలో జమ చేయొచ్చు కానీ.. రూ.5వేలు మాత్రం జమ చేయొద్దని ఆదేశించారు. అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని.. అలాగే అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని కూడా ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల్ని విడుదల చేయాలని సూచించారు.

ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు-1, చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో మనీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఎన్నికల కోడ్ కొండపి, కడియపులంక గ్రామ పంచాయతీలు.. కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు.. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లలో అమల్లో ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఈ పథకానికి అర్హులైన రైతులందరి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ పథకం ద్వారా 46,85,838 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరుతుంది.. మొదటి విడతలో రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అన్నదాతాసుఖీభవ పథకానికి అర్హులైన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు, కేంద్రం రూ.831.51 కోట్లు ఈ పథకం కోసం ఇస్తున్నాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి