Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

3 August 2025

Video: తన సమాధిని తానే తవ్వకుంటున్న ఇజ్రాయెల్‌ బంధీ..! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

3 August 2025

Parenting Tips: మీ పిల్లలు ఏదీ గుర్తుంచుకోవడం లేదా..? ఇలా చేయండి.. మెమోరీ పవర్ డబుల్..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Defense Manufacturing Unit Jaggayyapeta,జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌.. పరిశీలించిన కేంద్ర బృందాలు.. భారీగా ఉపాధి అవకాశాలు… – central govt will plan to setup defense cluster manufacturing unit at jaggayyapeta
ఆంధ్రప్రదేశ్

Defense Manufacturing Unit Jaggayyapeta,జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌.. పరిశీలించిన కేంద్ర బృందాలు.. భారీగా ఉపాధి అవకాశాలు… – central govt will plan to setup defense cluster manufacturing unit at jaggayyapeta

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Defense Manufacturing Unit Jaggayyapeta,జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌.. పరిశీలించిన కేంద్ర బృందాలు.. భారీగా ఉపాధి అవకాశాలు… – central govt will plan to setup defense cluster manufacturing unit at jaggayyapeta
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్‌తో పాటు మరికొన్ని రక్షణ రంగ సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు శర వేగంగా అడుగులు పడుతున్నాయి. జయంతిపురం, పెద్దవరంలో ఇందుకోసం వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి దేశీయంగా గుర్తింపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంటున్నారు. ఆ వివరాలు..

హైలైట్:

  • జగ్గయ్యపేటలో డిఫెన్స్‌ క్లస్టర్‌ యూనిట్‌
  • రెండుసార్లు పరిశీలించిన కేంద్ర బృందాలు
  • జయంతిపురం, పెద్దవరంలో వందల ఎకరాల భూమి

జగ్గయ్యపేటలో బ్రహ్మోస్ మిసైల్స్ యూనిట్
జగ్గయ్యపేటలో బ్రహ్మోస్ మిసైల్స్ యూనిట్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నియోజకవర్గం రూపు రేఖలు మారబోతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నారు. ఎలా అంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు తాజాగా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరలో ఇక్కడ తమ యూనిట్‌ను నెలకొల్పే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బ్రహ్మోస్‌తో పాటుగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు కూడా ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు 2025 మే 19న కేంద్రానికి లేఖ రాశారు. జగ్గయ్యపేటలో మిసైల్స్, ఆయుధ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని ఆయన లేఖలో కోరారు.ఈక్రమంలోనే జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిఫెన్స్ కార్పొరేషన్ సీఎండీ ఆధ్వర్యంలోని బృందం ఈ ప్రాంతాన్ని ఇప్పటికే రెండుసార్లు సందర్శించింది.. పరిశీలించింది. దీంతో త్వరలోనే ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.

జగ్గయ్యపేట ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అంటున్నారు. పైగా ఈ ప్రాంతానికి రైలు, విమాన, రహదారి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కొన్ని గంటల్లోని ఇక్కడకు చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ఏపీఐఐసీ భూములు వేల ఎకరాల్లో ఖాళీగా ఉన్నాయి. అందుకే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఇది అనువైన ప్రదేశమని అంటున్నారు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌నుకలిసి.. రాష్ట్రంలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరింది.

బ్రహ్మెస్ క్షిపతి తయారీ యూనిట్ కోసం జగ్గయ్యపేట పరిధిలోని జయంతిపురంలో 800 ఎకరాలు, పెద్దవరంలో 1200 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ భూముల్లో రక్షణ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ సంస్థ ఇక్కడ ఏర్పాటైతే, జగ్గయ్యపేటకు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది అంటున్నారు.

ఇదిలా ఉంచితే ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో రూ.400 కోట్లతో తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు కానుంది. లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తోళ్ల పరిశ్రమతో పాటుగా, డిఫెన్స్ క్లస్టర్ కూడా ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్ (జెట్ సిటీ)లో మొదటి టవర్‌ను రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్ని కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు పెరిగి.. అభివృద్ధి జరగడమే కాక.. ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి