Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Horoscope Today: వీరు డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం మంచిది కాదు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

4 August 2025

Tirumala Devotees Darshan Crowd Management,తిరుమలలో ఇలా జరగడం విచిత్రంగా ఉందే.. చాలా రోజుల తర్వాత, ఏమైందంటే – ttd arrangements successfully implemented for tirumala devotees darshan crowd management

4 August 2025

Indian Railways: మీరు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే బుక్‌ అవుతాయి

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Baptla Quarry Accident,బాపట్ల.. గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. కనీసం ఆరుగురు మృతి – at least six labourers killed as many injured in granite quarry accident at bapatla
ఆంధ్రప్రదేశ్

Baptla Quarry Accident,బాపట్ల.. గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. కనీసం ఆరుగురు మృతి – at least six labourers killed as many injured in granite quarry accident at bapatla

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Baptla Quarry Accident,బాపట్ల.. గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. కనీసం ఆరుగురు మృతి – at least six labourers killed as many injured in granite quarry accident at bapatla
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బాపట్ల జిల్లాలో ఆదివారం ఉదయం ఓ గ్రానైట్ క్వారీలో హఠాత్తుగా బండరాలు పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు ఒడిశాకు చెందినవారు. క్వారీలో పనిచేయడానికి ఇక్కడకు వారిని నిర్వాహకులు తీసుకొచ్చారు.

(ఫోటోలు– Samayam Telugu)

బాపట్ల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఒక్కసారిగా రాళ్లు విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయానికి క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్వారీలో రాళ్లు ఒక్కసారిగా పడటంతో వాటి కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నర్సారావుపేట ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒక్కసారి గ్రానైట్ శ్లాబు విరిగిపడటంతో శిథిలాల కింద కార్మికులు ఇరుక్కుపోయారు. వీటిని వెలికితీస్తే ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది స్పష్టత వస్తుంది. ఘటనపై కలెక్టర్ స్పందించి… పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి