Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

3 August 2025

Video: తన సమాధిని తానే తవ్వకుంటున్న ఇజ్రాయెల్‌ బంధీ..! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

3 August 2025

Parenting Tips: మీ పిల్లలు ఏదీ గుర్తుంచుకోవడం లేదా..? ఇలా చేయండి.. మెమోరీ పవర్ డబుల్..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Weather Update: మరో మూడ్రోజులు వానలు.. ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు.. బీ అలర్ట్! – apsdma weather forecast moderate to heavy rains in coming three days in palnadu and rayalaseema districts
ఆంధ్రప్రదేశ్

Weather Update: మరో మూడ్రోజులు వానలు.. ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు.. బీ అలర్ట్! – apsdma weather forecast moderate to heavy rains in coming three days in palnadu and rayalaseema districts

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weather Update: మరో మూడ్రోజులు వానలు.. ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు.. బీ అలర్ట్! – apsdma weather forecast moderate to heavy rains in coming three days in palnadu and rayalaseema districts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు పల్నాడు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫ్రఖర్ జైన్ వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో మూడ్రోజులు వానలు.. ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు.. బీ అలర్ట్!
మరో మూడ్రోజులు వానలు.. ఈ జిల్లాలలో రేపు భారీ వర్షాలు.. బీ అలర్ట్! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు అలర్ట్.. ఏపీలో వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షం కురిసే సమయంలో.పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

*పైకి నవ్వుతూ కనిపించే హెచ్ఆర్ ఉద్యోగం.. లోపల మాత్రం.. భర్తే అనుకుంటే, మామ కూడానా?

మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం రోజు అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు జిల్లా, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన భారీ వాహనాలు

*ఏపీలోని ఎస్సీ, ఎస్టీ యువతకు తీపికబురు.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ.!

మంగళవారం రోజున పల్నాడు జిల్లా , ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా , అల్లూరి జిల్లా, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

బుధవారం రోజున అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, పల్నాడు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మరోవైపు భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దని.. పాతబడిన భవనాలు, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. అలాగే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, కల్వర్టుల సమీపంలో ఉండవద్దని సూచించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి