Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: స్నేహం అంటే ఇదేరా..! ఫ్రెండ్ ని రక్షించేందుకు అలలతో పోరాడిన స్నేహితులు .. వీడియో వైరల్

4 August 2025

Kaleshwaram Project: కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

4 August 2025

Tollywood: పాక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో! ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరిక

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Cancelled Arjitha Sevas,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 4 రోజులు పాటూ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas due to tirumala pavithrotsavam is scheduled for august 5 to 7
ఆంధ్రప్రదేశ్

Tirumala Cancelled Arjitha Sevas,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 4 రోజులు పాటూ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas due to tirumala pavithrotsavam is scheduled for august 5 to 7

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Cancelled Arjitha Sevas,తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 4 రోజులు పాటూ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas due to tirumala pavithrotsavam is scheduled for august 5 to 7
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala TTD Cancelled Arjitha Sevas: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నాలుగు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 5 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే దోషాల వల్ల పవిత్రతతకు ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు
  • నాలుగు రోజుల పాటూ నిర్వహిస్తారు
  • నాలుగు రోజులు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల పవిత్రోత్సవాలు
తిరుమల పవిత్రోత్సవాలు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలకు ఆగ‌స్టు ఇవాళ అంకురార్పణ జరగనుంది. ‘ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది’ అని తెలిపారు.’ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ మేరకు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప‌విత్రోత్సవాల్లో ఆగ‌స్టు 4న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగ‌స్టు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్దయ్యాయి’ అని టీటీడీ తెలిపింది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

‘తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్యక్రమాలు, ఆగ‌స్టు 8న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్నప‌న‌తిరుమంజ‌నం, చ‌క్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేప‌డ‌తారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధ‌ర్మప్రచార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు’ అని తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు

‘తిరుపతి శ్రీ కోదండరామస్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు’ అని టీటీడీ తెలిపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి