Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: వామ్మో.. రాత్రిపూట పెరుగు తింటే ఇన్ని సమస్యలా..? తెలిస్తే షాకే..

4 August 2025

Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!

4 August 2025

Shubman Gill: ఒకే సిరీస్‌తో ఆ దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసి గిల్.. ఇంకా ఎన్నో అద్భుతాలు..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Bar Policy Kallu Geetha Karmikulu Quota,ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. – ap government to give 10 percent quota for kallu geetha communities in new bar policy from september 1
ఆంధ్రప్రదేశ్

Ap Bar Policy Kallu Geetha Karmikulu Quota,ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. – ap government to give 10 percent quota for kallu geetha communities in new bar policy from september 1

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Bar Policy Kallu Geetha Karmikulu Quota,ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. – ap government to give 10 percent quota for kallu geetha communities in new bar policy from september 1
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Government Give 10 Percents bars to Kallu Geetha Karmikulu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అమలు చేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బార్ పాలసీ గడువు ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నారు. మరోవైపు కొత్త బార్ పాలసీలో భాగంగా కల్లుగీత కార్మికులకు 10 శాతం కోటా కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఏపీలోని కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీలోని కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. (ఫోటోలు– Samayam Telugu)

AP Government Give 10 Percents bars to Kallu Geetha Karmikulu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్ వినిపించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన బార్‌ పాలసీ అమలు చేయనున్నారు, ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా నూతన బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆల్కహాల్‌ తక్కువ ఉన్న మద్యం అమ్మకాల ద్వారా మద్యం వలన కలిగే నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని సూచించారు. ఇక నూతన బార్ పాలసీ ప్రకారం.. బార్ల కేటాయింపులోనూ కల్లుగీత వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అమలు చేస్తున్న ఏపీ లిక్కర్ పాలసీలోనూ కల్లుగీత వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రస్తుతం ఉన్న బార్ పాలసీని పూర్తి స్థాయిలో మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమలు చేయనున్న నేపథ్యంలో బార్ పాలసీ రూపకల్పనతో అధికారులు కసరత్తు చేస్తు్న్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని బార్లు ఏర్పాటు చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలు సడలించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో కొత్త బార్లు ఏర్పాటును ప్రోత్సహించేలా నిబంధనలు సడలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం ఉన్న బార్లను ఒకచోట నుంచి మరో చోటకు మార్చుకునే వెసలుబాటును కల్పించనున్నట్లు తెలిసింది.

ఈ నెల 31వ తేదీతో ప్రస్తుతం ఉన్న ఏపీ బార్ పాలసీ ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఎక్సైజ్ పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బార్ పాలసీ రూపకల్పనలోనూ పనిచేస్తోంది. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. అలాగే స్టార్ హోటల్స్, మైక్రోబ్రూవరీలలో మరో 50 బార్లు పనిచేస్తున్నాయి. అలాగే ప్రస్తుత పాలసీ పీరియడ్‌లో 44 బార్లు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. వీటన్నింటిని మీద ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. తాజాగా కల్లుగీత కార్మికులకు బార్లలో పదిశాతం కోటా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో 840 బార్లలో 84 బార్లు ఆ సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మరికొన్ని కొత్త బార్లు ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి