Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆక్రోషం వెళ్లగక్కిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి! ఎవరి కాళ్లో మొక్కాల్సిన అవసరం లేదంటూ..

5 August 2025

Viral Video: స్పైస్ జెట్ ఉద్యోగుల దాడి కేసులో ట్విస్ట్?… తొలుత ఆర్మీ అధికారిపైనే సిబ్బంది దాడి చేసినట్లు చూపించే మరో వీడియో

5 August 2025

UTI Vs Yeast Infection: మహిళల్లో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ కి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Apssdc Employees Terminated,ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరి తొలగింపు, వారికి నోటీసులు – andhra pradesh government decision on apssdc employees attendance issue
ఆంధ్రప్రదేశ్

Ap Govt Apssdc Employees Terminated,ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరి తొలగింపు, వారికి నోటీసులు – andhra pradesh government decision on apssdc employees attendance issue

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Apssdc Employees Terminated,ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరి తొలగింపు, వారికి నోటీసులు – andhra pradesh government decision on apssdc employees attendance issue
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh APSSDC Employees Terminated: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పలువురు ఉద్యోగుల్ని తొలగించింది. మరికొందరికి నోటీసులు జారీ చేసింది. కొందరు ఉద్యోగులు హాజరు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొందరు కూడా ఇలాగే చేశారని.. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కొందరు ఉద్యోగులకు విధులకు వెళ్లకుండానే అటెండెన్స్ మేనేజ్ చేసినట్లు చెబుతున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉద్యోగుల తొలగింపు
  • ముఖ గుర్తింపు హాజరు ట్యాంపరింగ్
  • ఉద్యోగుల తొలగింపు, వారికి నోటీసులు
ఏపీలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉద్యోగుల తొలగింపు
ఏపీలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉద్యోగుల తొలగింపు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)లో తాజాగా ఒక మోసం బయటపడింది. ముఖం గుర్తింపు హాజరు (FRA) టెక్నాలజీని తప్పుదోవ పట్టించి.. విధులకు రాకుండానే హాజరు వేసిన ఉద్యోగులను తొలగించారు.. మరికొందరికి నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పే సిబ్బంది ఇలా చేయడం సంచలనంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది జరుగుతోంది.. కొందరు ఉద్యోగులు వేరే వాళ్ళతో హాజరు వేయించుకున్నారు.. ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులను తొలగించింది.. మరో 10మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. త్వరలో మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు.కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లకుండానే హాజరు వేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ సిబ్బంది తనిఖీలు చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు తప్పుడు హాజరు వేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు విధులకు వెళ్లని సమయంలో యాప్‌లో వేరే వారి ముఖం పెట్టి హాజరు వేసేవారని సమాచారం. ఉద్యోగులు విధులకు రానప్పుడు, వారి ముఖం తీసేసి, వేరే ఉద్యోగి ముఖం పెట్టేవారు. అసలు ఉద్యోగి వచ్చినప్పుడు, బోగస్ ఉద్యోగి ముఖం తీసేసి, అతని ముఖంతో హాజరు వేసేవారు. ఇలా చాలా మంది హాజరు నమోదు చేశారు. కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఏపీఎస్‌ఎస్‌డీసీ టెక్నికల్ సిబ్బంది పరిశీలించారు.

వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోనిద దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎఫ్‌ఆర్‌ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు.. కొన్ని విభాగాల్లో జియోఫెన్సింగ్ ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. అయితే, నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎఫ్‌ఆర్‌ఏ ట్యాంపరింగ్ జరగడంతో ఇతర శాఖల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, హాజరు నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ముఖ చిత్రాలను మార్చకుండా లాక్ చేసిన చోట, డీడీవోల పాస్‌వర్డ్‌లతో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా అని ఆరా తీస్తున్నారు. అయితే, నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎఫ్‌ఆర్‌ఏను ట్యాంపరింగ్ చేసిన ఉదంతం బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల్లో హాజరు ఎలా నమోదవుతుందో సర్వర్‌లో పరిశీలిస్తున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీలో ట్యాంపరింగ్ ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి