Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..

7 August 2025

ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్‌ టు విజయవాడ – Telugu News | Nitin Gadkari’s Andhra Pradesh Highway Boost rs 5233 Crore Investment video

7 August 2025

Patanjali: పతంజలి బిగ్ అప్‌డేట్.. ఆ రోజే త్రైమాసిక ఫలితాల విడుదల

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Suspends Two Employees,తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్, రాజకీయ నేతలతో లింక్ – ttd suspends two employees for misconduct after probe into the allegations against them
ఆంధ్రప్రదేశ్

Ttd Suspends Two Employees,తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్, రాజకీయ నేతలతో లింక్ – ttd suspends two employees for misconduct after probe into the allegations against them

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Suspends Two Employees,తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్, రాజకీయ నేతలతో లింక్ – ttd suspends two employees for misconduct after probe into the allegations against them
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Suspends Two Employees For Misconduct: టీటీడీ నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. నిబంధనలు అతిక్రమించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేశారు.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌ను సస్పెండ్ చేశారు.. జూనియర్ అసిస్టెంట్ రామును కూడా సస్పెండ్ చేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియజేయాలని ఈ ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరికొందరిపైనా చర్యలు తప్పవంటున్నారు.

హైలైట్:

  • టీటీడీ ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది
  • మరో ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ
  • మరికొందరిపైనా త్వరలోనే చర్యలకు ఛాన్స్
నలుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలు
నలుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలు (ఫోటోలు– Samayam Telugu)

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. రాజకీయ నాయకులతో కలిసి వ్యాపారాలు చేయడం, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయడం, క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ విచారణలో ఉద్యోగులు తప్పు చేసినట్లు తేలింది. దీంతో ఇద్దర్ని సస్పెండ్ చేశారు. టీటీడీ క్రమశిక్షణా విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు ఉద్యోగులు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఫిర్యాదులు అందాయి. వీరు రాజకీయ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని, భారీగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అలాగే టీటీడీ క్వార్టర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. విచారణలో ఉద్యోగులు నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. టీటీడీ నియమావళిని అతిక్రమించి సంస్థ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరించినట్లు తేలింది. తిరుమలలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కె.రాము, ఆఫీస్ సబార్డినేట్ ఎన్.శంకర్‌ను సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

వీరిద్దరితో పాటుగా తిరుపతిలో రాజకీయ నాయకులకు సేవ చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు నిబంధనలు తప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తిరుమల కల్యాణకట్టలో పనిచేసే వెంకీపురం పవన్‌కుమార్, శ్రీనివాసమంగాపురంలో అర్చకులుగా ఉన్న బాలాజీ రంగస్వామికి కూడా నోటీసులు ఇచ్చారు. కొంతమంది ఉద్యోగులు రాజకీయ సభలకు వెళ్లారని గుర్తించారు.. అందుకే వీరందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఉద్యోగులు రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరిస్తోంది.

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు

గతేడాది అక్టోబరు 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో రద్దీ పెరిగింది. ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. విధుల్లో లేని ఉద్యోగులు పవన్‌ను చూడటానికి రావడంతో రద్దీ పెరిగిందని విజిలెన్స్ విభాగం తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిగింది. శ్రీనివాసమంగాపురంలో పనిచేసే అర్చకుడు బాలాజీ రంగకుమార్, తిరుపతి ఈఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్ నిబంధనలు ఉల్లంఘించారని తేలింది. వారిద్దరూ డిప్యూటీ సీఎంను అనుసరించారని నివేదికలో తేల్చారు. సాధారణంగా ప్రముఖుల పర్యటనలో కొందరికి (ప్రొటోకాల్ సిబ్బంది, అర్చకులు, మేళం సిబ్బంది, అటెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అనుమతి ఉంటుంది) మాత్రమే విధులను కేటాయిస్తారు. కానీ కొందరు ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించారు. పవన్‌ను కలవాలనే ఉద్దేశ్యంతో ఆలయంలోకి ప్రవేశించారు. దీనివల్ల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద టీటీడీ ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి