Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Astrology: ఉదయాన్నే 3 – 5 గంటల మధ్య ఎవరో లేపినట్లు.. మీరై మెలకువ వస్తుందా? ఇది అర్ధం ఏమిటో తెలుసా..

10 August 2025

షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక నుండి ఈ ఆహారాలపై ఫోకస్ చేయండి..! ఇవి షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి..!

10 August 2025

AAI Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు!

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap In India Justice Report 2025,ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే.. – andhra pradesh ranks second in india justice report 2025
ఆంధ్రప్రదేశ్

Ap In India Justice Report 2025,ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే.. – andhra pradesh ranks second in india justice report 2025

.By .9 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap In India Justice Report 2025,ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే.. – andhra pradesh ranks second in india justice report 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh in India Justice Report: ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 ర్యాంకింగ్స్‌లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది రెండో స్థానానికి చేరటం విశేషం. మరోవైపు ఈ జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో ఉంది. ఏపీ రెండో స్థానంలో నిలవగా.. తెలంగాణ మూడు, కేరళ నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే..
ఆంధ్రప్రదేశ్ మరో ఘనత.. కర్ణాటక తర్వాత దేశంలో రెండో ప్లేసు మనదే.. (ఫోటోలు– Samayam Telugu)
Andhra Pradesh in India Justice Report: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. ప్రజలకు వేగంగా న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరును కనబరిచినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభద్రతలు, న్యాయవ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 రూపొందించారు. ఇక ఈ రిపోర్టులో 6.78 స్కోర్‌తో కర్ణాటక తొలిస్థానంలో నిలవగా.. 6.32 స్కోర్‌తో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మహిళలు ఆపదలో చిక్కుకున్నప్పుడు, అత్యవసర సమయాల్లో ఈ శక్తి యాప్ ద్వారా పోలీసులు సహాయం వెంటనే పొందేందుకు వీలవుతుంది. ఈ శక్తి యాప్‌లో ఫిర్యాదు చేయడం, లైవ్ ట్రాకింగ్, పోలీసులను అలర్ట్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు శక్తి యాప్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో అనుసంధానమై ఉంటుంది. దీనితో పాటుగా జిల్లాలలో శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. ఈ శక్తి బృందాలు కాలేజీలు, బస్టాండులు, పార్కుల వంటి ప్రదేశాల్లో సంచరిస్తూ అమ్మాయిలను వేధించే ఈవ్ టీజర్లు, పోకిరీల పనిబడుతూ ఉంటాయి. అలాగే సఖి నివాస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే సాంకేతిక వినియోగం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటుగా నేరస్థులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేస్తూ అసాంఘిక శక్తుల పని పడుతున్నారు. డ్రగ్స్ రవాణా, గంజాయి స్మగ్లింగ్, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు శివారు ప్రాంతాలు అడ్డాగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో అలాంటి అనుమానిత ప్రాంతాలలో డ్రోన్లను ఎగరవేస్తూ వారి ఆట కట్టిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుతో అనుక్షణం నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కుటుంబాలలో ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటుగా ఈగల్ టీమ్ ద్వారా గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి