Vangalapudi Anitha Rakhi Pournami,తప్పులు చేయొద్దు.. జైల్లో రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత – ap home minister anitha celebrates raksha bandhan in visakhapatnam prison
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. రాఖీ పౌర్ణమిని వినూత్నంగా జరుపుకున్నారు. తాను బాధ్యతలు నిర్వర్తిస్తోన్న హోం మంత్రిత్వ శాఖలో సిబ్బందితో కలిసి రక్షాబంధన్ను జరుపుకున్నారు. విశాఖపట్నంలోని తన క్యాంప్ ఆఫీసులో పోలీసు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన అనిత.. ఆ తర్వాత కానిస్టేబుల్ కొర్లయ్య ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొర్లయ్య ఇంటికి ఆటోలో వచ్చారు. ముందుగా ఆటో డ్రైవర్ గిరీష్కు రాఖీ కట్టారు. అనంతరం కొర్లయ్య ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. కొర్లయ్యకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీలకు రాఖీలు కట్టారు. గంజాయి తదితర కేసుల్లో అరెస్ట్ అయి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న దాదాపు 30 మంది యువకులకు అనిత రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. జైలు సిబ్బందికి కూడా అనిత రాఖీలు కట్టారు. తెలిసీ తెలియని వయసులో యువత తప్పులు చేసి ఇలా జైలు పాలవుతున్నారని.. అలాంటి తప్పులు మళ్లీ చేయొద్దని వారికి చెప్పానని అనిత వెల్లడించారు.