Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vizag Google: విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

14 October 2025

Watch: చుక్క పడ్డాకే అసలు సీన్ మొదలైంది.. కాళికా బార్‌లో సినిమా ఫైటింగ్ రియల్ సీన్.. వీడియో

14 October 2025

సర్వ రోగ నివారిణి ఇదే.. ఈ నల్లని పండు ఎక్కడ కనిపించినా వదలొద్దు.. చలికాలంలో తప్పక తినాలి!

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Grama Ward Sachivalayam Employees Promotions,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..! – ap government appoints cabinet sub committee to study on village and ward secretariat employees promotions
ఆంధ్రప్రదేశ్

Grama Ward Sachivalayam Employees Promotions,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..! – ap government appoints cabinet sub committee to study on village and ward secretariat employees promotions

.By .13 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Grama Ward Sachivalayam Employees Promotions,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..! – ap government appoints cabinet sub committee to study on village and ward secretariat employees promotions
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP village and ward secretariat employees promotions: ఏపీలో గ్రామ. వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉప సంఘం ప్రమోషన్లపై చర్చించి, అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Sachivalayam
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. పది మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌‌తో పాటుగా మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, డోలాశ్రీబాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌, గుమ్మడి సంధ్యారాణిని సభ్యులుగా నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్లపై అధ్యయనం చేయనుంది.

*ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది?

మరోవైపు ఇంటర్‌మీడియేటరీ పోస్టులను సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టుల పే స్కేల్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీని ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైనా చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశం గురించి అధ్యయనం పూర్తి చేసి.. సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాలని ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు

*రుషికొండను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు.. మీరు కూడా సలహా ఇవ్వొచ్చు.. వివరాలివే..

ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు

మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఏపీ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసింది. ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన వారిని బదిలీ చేసింది. అయితే బదిలీలలో.. అంధులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైబడి పనిచేసిన వారు, మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందినవారు, క్యాన్సర్, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చింది. భార్యాభర్తలు గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తూ ఉంటే వారిని సమీప ప్రాంతాల్లోనే నియమించేలా చర్యలు తీసుకుంది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులపై కీలక అడుగులు వేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి