Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. Money9 సమ్మిట్‌లో సీఎం ఫడ్నవీస్ కీలక కామెంట్స్..

12 March 2026

IPL 2026: ఐపీఎల్‌లో SRH Vs RCB ఫస్ట్ మ్యాచ్.. కానీ.! మళ్లీ అదే తప్పు చేసిన బీసీసీఐ..

12 March 2026

Sridevi: శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు.. తర్వాత ఆయనే సారీ చెప్పారు.. సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bullet Train In Andhra Pradesh,ఏపీలో బుల్లెట్ రైలుపై కీలక అప్‌డేట్.. ఆ ప్రాంతంలో మట్టి పరీక్షలు.. – hyderabad bangalore bullet railway line updates soil tests in anantapur district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Bullet Train In Andhra Pradesh,ఏపీలో బుల్లెట్ రైలుపై కీలక అప్‌డేట్.. ఆ ప్రాంతంలో మట్టి పరీక్షలు.. – hyderabad bangalore bullet railway line updates soil tests in anantapur district andhra pradesh

.By .17 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bullet Train In Andhra Pradesh,ఏపీలో బుల్లెట్ రైలుపై కీలక అప్‌డేట్.. ఆ ప్రాంతంలో మట్టి పరీక్షలు.. – hyderabad bangalore bullet railway line updates soil tests in anantapur district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండటంతో.. నిపుణులు పలుచోట్ల మట్టిని సేకరించి.. పరీక్షలు నిర్వహించారు.

Bullet train
ఏపీలో బుల్లెట్ రైలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఏపీలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. దక్షిణాదిలో పెద్ద నగరాలైన హైదరాబాద్ – బెంగళూరు, అలాగే హైదరాబాద్ – చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ రైల్వే లైన్ ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. అలాగే హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ రైల్వే లైన్ గుంటూరు జిల్లా మీదుగా వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం అధికారులు కసరత్తు మొదలెట్టారు.

అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పరీక్షలు నిర్వహించారు. హైస్పీడ్ రైల్నే లైన్ ఏర్పాటు కోసం భూసామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రోజున మట్టి పరీక్షలు చేశారు. అనంతపురం రూరల్‌ మండలం, బుక్కరాయసముద్రం మండలంలోని కొన్ని గ్రామాలతో పాటుగా, సిద్దరాంపురం పరిసరాల్లో నిపుణుల బృందం మట్టి పరీక్షలు నిర్వహించింది. 40 పాయింట్ల వద్ద నుంచి మట్టి నమూనాలను సేకరించినట్లు సమాచారం.

మరోవైపు దక్షిణాదిలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు. ఈ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం సర్వే కూడా మొదలైందని ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025లో భాగంగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే దక్షిణ భారతదేశానికి కూడా బుల్లె్ట్ రైలు వస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. సర్వే కూడా పూర్తైందని.. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరును కలుపుతూ దీనిని ఏర్పాటు చేస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఈ నాలుగు నగరాల జనాభా కోట్లల్లో ఉందన్న చంద్రబాబు.. వీటిని అనుసంధానం చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్‌గా, అతిపెద్ద మార్కెట్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బుల్లెట్ రైలు వస్తే దక్షిణాది ప్రాంత అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు మన దేశంలో తొలి బుల్లెట్ రైలును ముంబయి- అహ్మదాబాద్ మధ్య ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తే.. నాలుగు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని… వాణిజ్యం, వ్యాపారం. వర్తకం, సాంస్కృతిక, పర్యాటకంగా నాలుగు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి