Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..

11 March 2026

నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా

11 March 2026

మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ysrcp Mlas Notice,YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. – ap ethics committee likely to issue notices to ysrcp mlas who do not attend assembly
ఆంధ్రప్రదేశ్

Ysrcp Mlas Notice,YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. – ap ethics committee likely to issue notices to ysrcp mlas who do not attend assembly

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ysrcp Mlas Notice,YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. – ap ethics committee likely to issue notices to ysrcp mlas who do not attend assembly
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీకి రాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని ఎథిక్స్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభకు రాని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి.. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. వివరణ తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం రోజున ఎథిక్స్ కమిటీ భేటీయై ఈ అంశంపై చర్చించింది.

YSRCP
వైసీపీ ఎమ్మెల్యేలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులు ఇవ్వాలని.. నోటీసులపై వారి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఎథిక్స్ కమిటీ సభ్యులు బుధవారం రోజున భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని చర్చించారు. టీఏ, డీఏలు కూడా పొందుతున్నారని భేటీలో ప్రస్తావనకు వచ్చింది.

కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని.. ఆరుగురు అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని చర్చించారు. ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలనే అంశం గురించి చర్చ జరిగింది. త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. వివరణ తీసుకున్న తర్వాత.. ప్రజాభిప్రాయం తీసుకుని ఈ విషయంలో ముందుకెళ్లాలని ఎథిక్స్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.

ఎన్డీఏ కూటమి 164 చోట్ల విజయం సాధించగా.. వైసీపీ కేవలం11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సామర్థ్యంలో 10 శాతం సీట్లు రాకపోవటంతో వైసీపీకి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే సభలో ప్రతిపక్షం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు అవకాశం ఉంటుందని జగన్ చెప్తున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావటం లేదు. ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే సభకు రాని ఎమ్మెల్యేల విషయంపై ఎథిక్స్ కమిటి భేటీ అయ్యి చర్చించింది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. వివరణ తీసుకున్న అనంతరం తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి