Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈరోజే స్టార్ట్ చేయండి..! రోజూ 15 నిమిషాలు కేటాయిస్తే మీ గుండె పదిలం, వెయిల్ లాస్‌ ఖాయం

13 February 2026

Telangana Municipal Elections 2026 Result Live: టెన్షన్‌ టెన్షన్.. అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!

13 February 2026

Kadapa Bangalore Railway Line,ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.2,505 కోట్లతో, బెంగళూరు 5 గంటల్లో వెళ్లొచ్చు – mp daggubati purandeswari requests railway minister ashwini vaishnaw on kadapa bangalore new railway line

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Railway Kodur Mla Arava Sridhar,తక్కువ స్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యేను చేస్తే…. అరవ శ్రీధర్‌‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – tadepalligudem janasena mla bolisetti srinivas sensational comments on railway kodur mla arava sridhar
ఆంధ్రప్రదేశ్

Railway Kodur Mla Arava Sridhar,తక్కువ స్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యేను చేస్తే…. అరవ శ్రీధర్‌‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – tadepalligudem janasena mla bolisetti srinivas sensational comments on railway kodur mla arava sridhar

.By .12 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Railway Kodur Mla Arava Sridhar,తక్కువ స్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యేను చేస్తే…. అరవ శ్రీధర్‌‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – tadepalligudem janasena mla bolisetti srinivas sensational comments on railway kodur mla arava sridhar
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలు బయటకు రావడం.. ఆయనపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి.. తనను ఎమ్మెల్యే మోసం చేశాడని ఆరోపించింది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాగా.. జనసేన ఎమ్మెల్య అరవ శ్రీధర్ సభకు హాజరు కాలేదు.

హైలైట్:

  • రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు
  • వీడియోలు బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో రచ్చ
  • విచారణకు కమిటీ ఏర్పాటుచేసిన జనసేన అధిష్ఠానం
Arava Sridhar
ఎమ్మెల్యే అరవ శ్రీధర్(ఫోటోలు– Samayam Telugu)
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆయన సభకు హాజరుకాకపోవడంపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవ శ్రీధర్‌ను అసెంబ్లీకి రావద్దని పార్టీ ఆదేశించలేదని, శాసనసభకు రావడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదేమో అని వ్యాఖ్యానించారు. తక్కువ స్థాయి వ్యక్తులను ఎమ్మెల్యేలను చేస్తే.. తమ అధినేత పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారని అన్నారు. తాము కేసులు, జైలు పోరాటాలు చేసి ఎమ్మెల్యేలు అయ్యామని బొలిశెట్టి చెప్పారు. అంతేకాదు, శ్రీధర్ వ్యక్తిగత విషయాన్ని పార్టీకి ఆపాదించవద్దని ఆయన సూచించారు.ఇదిలా ఉండగా అరవ శ్రీధర్‌ లైంగిక ఆరోపణల అంశంపై విచారణకు జనసేన పార్టీ ఏర్పాటుచేసిన కమిటీ సభ్యుడు శివశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు రైల్వే కోడూరూలో 50 మందిని విచారించామని వివరించారు. అంతేకాదు, బాధితురాలిని విచారణకు రావాలని కోరామని, కానీ ఆమె రాలేదన్నారు. షీల్డ్ కవర్‌లో ఆమె వివరాలు పంపిందని, వాటిని పరిశీలిస్తామని శివశంకర్ అన్నారు. అలాగే, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని, శ్రీధర్, బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. దీనిని జనసేనపై రుద్ది ప్రయత్నం చేయొద్దని ఆయన పేర్కొన్నారు.

వారంలోగా విచారణ కమిటీ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్‌ను పార్టీ ఆదేశించిందని, వారంలోగా నివేదిక ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదని శివశంకర్ పేర్కొన్నారు. త్వరలోనే విచారణను పూర్తిచేసి కమిటీ నివేదికను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అందజేస్తామని ఆయన అన్నారు. అంతేకాదు, రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలో, కమిటీ ఎలా పనిచేయాలో వైసీపీకి సంబంధం లేని విషయం అని తేల్చిచెప్పారు. కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. కానీ, ఆయన ముందురోజు విజయవాడకు చేరుకోవడంతో వస్తారని భావించారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి