Nandamuri BalaKrishna Calls Mla Ms Raju Daaku Maharaj: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్య నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. లాబీల్లో ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడారు. హంద్రీనీవా నీళ్ల గురించి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో చర్చ జరిగింది. నీటిని మడకశిరకు తీసుకెళ్తున్నారని.. ఎంఎస్ రాజు డాకు మహారాజ్ అని బాలయ్య వాఖ్యానించారు. తన నియోజకవర్గానికి నీటీ అవసరం ఉందని.. పెద్ద మనసు చేసుకోవాలని బాలయ్యతో అన్నారు ఎంఎస్ రాజు.
హైలైట్:
- ఏపీ అసెంబ్లీలో సరదా సంభాషణ
- టీడీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య
- డాకు మహారాజ్ అంటూ పిలుపు

ప్రతిపక్షం అసెంబ్లీకి రాలేదా అంటూ బాలయ్య ఎమ్మెల్యేలతో అన్నారు. గవర్నర్ ప్రసంగానికి వచ్చి.. ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్లిపోయారని ఎమ్మెల్యేలు చెప్పారట. అలాగే నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమా ఏంటని ఎమ్మెల్యేలు ఆరా తీశారు. తనకు మలినేని గోపీచంద్తో మంచి కథతో సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య చర్చ జరిగింది. మొత్తానికి ఈ సరదా సంభాషణ ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరంగా మారింది.
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్ ఛాంబర్లో ఇద్దరు సమావేశమయ్యారు. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. హిందూపురానికి రూ.24 కోట్లు విడుదల చేయాలని కోరారు.. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్తో ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా పవన్ను కలిశారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.


