Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మహాశివరాత్రి నాడు అద్భుత గ్రహాల సంయోగం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం

13 February 2026

Ap Private Schools Free Rte Admissions,విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి – andhra pradesh government invites applications for ap right to education act admissions 2026 for in private schools

13 February 2026

Telangana Municipal Election Results: అక్కడ బోణీ కొట్టిన టీడీపీ.. రక్తి కట్టిస్తున్న మున్సిపల్ ఫలితాలు..

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nandamuri Balakrishna In Assembly,ఆ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీరాభిమాని.. అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ – hindupur mla nandamuri balakrishna calls madakasira mla ms raju as daaku maharaju assembly lobby
ఆంధ్రప్రదేశ్

Nandamuri Balakrishna In Assembly,ఆ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీరాభిమాని.. అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ – hindupur mla nandamuri balakrishna calls madakasira mla ms raju as daaku maharaju assembly lobby

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nandamuri Balakrishna In Assembly,ఆ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీరాభిమాని.. అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ – hindupur mla nandamuri balakrishna calls madakasira mla ms raju as daaku maharaju assembly lobby
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nandamuri BalaKrishna Calls Mla Ms Raju Daaku Maharaj: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్య నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. లాబీల్లో ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడారు. హంద్రీనీవా నీళ్ల గురించి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో చర్చ జరిగింది. నీటిని మడకశిరకు తీసుకెళ్తున్నారని.. ఎంఎస్ రాజు డాకు మహారాజ్ అని బాలయ్య వాఖ్యానించారు. తన నియోజకవర్గానికి నీటీ అవసరం ఉందని.. పెద్ద మనసు చేసుకోవాలని బాలయ్యతో అన్నారు ఎంఎస్ రాజు.

హైలైట్:

  • ఏపీ అసెంబ్లీలో సరదా సంభాషణ
  • టీడీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య
  • డాకు మహారాజ్ అంటూ పిలుపు
Nandamuri Balakrishna
ఎమ్మెల్యేలతో బాలకృష్ణ సరదా సంభాషణ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లాబీల్లో సందడి చేశారు.. టీడీపీ ఎమ్మెల్యేలతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజులతో బాలయ్య సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును బాలయ్య డాకు మహారాజ్ అని పిలిచారు.. ఇలా పిలవడానికి ఓ కారణాన్ని చెప్పుకొచ్చారు. ఎంఎస్ రాజు హంద్రీనీవా నీటిని హిందూపురాన్ని కాదని మడకశిర నియోజకవర్గానికి తీసుకుపోతున్నారని బాలయ్య వ్యాఖ్యానించారు. అందుకే ఎంఎస్ రాజును ‘డాకు మహారాజ్’ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ఎంఎస్ రాజు.. వెనుకబడిన ప్రాంతమైన మడకశిర నియోజకవర్గానికి నీటి అవసరం ఎక్కువగా ఉందన్నారు. అందుకే పెద్ద మనసు చేసుకోవాలని బాలయ్యను కోరారు. ‘హిందూపురం ప్రజలతో పాటు మడకశిర ప్రజలూ బాగుండాలి’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. అదే సమయంలో హిందూపురం నియోజకవర్గానికి కూడా నీటి అవసరం ఉంది అన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నందమూరి బాలకృష్ణ అభిమాని.. అందుకే ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.

ప్రతిపక్షం అసెంబ్లీకి రాలేదా అంటూ బాలయ్య ఎమ్మెల్యేలతో అన్నారు. గవర్నర్ ప్రసంగానికి వచ్చి.. ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్లిపోయారని ఎమ్మెల్యేలు చెప్పారట. అలాగే నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమా ఏంటని ఎమ్మెల్యేలు ఆరా తీశారు. తనకు మలినేని గోపీచంద్‌తో మంచి కథతో సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య చర్చ జరిగింది. మొత్తానికి ఈ సరదా సంభాషణ ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరంగా మారింది.

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్‌ ఛాంబర్‌లో ఇద్దరు సమావేశమయ్యారు. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. హిందూపురానికి రూ.24 కోట్లు విడుదల చేయాలని కోరారు.. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా పవన్‌ను కలిశారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి