Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మహాశివరాత్రి నాడు అద్భుత గ్రహాల సంయోగం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం

13 February 2026

Ap Private Schools Free Rte Admissions,విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి – andhra pradesh government invites applications for ap right to education act admissions 2026 for in private schools

13 February 2026

Telangana Municipal Election Results: అక్కడ బోణీ కొట్టిన టీడీపీ.. రక్తి కట్టిస్తున్న మున్సిపల్ ఫలితాలు..

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srisailam Toll Gate Free,శ్రీశైలం వెళ్లే భక్తులకు రెండు శుభవార్తలు.. నాలుగు రోజులు పూర్తిగా ఉచితం, శివరాత్రి స్పెషల్ – four days toll fees exemption for devotees on the occasion of maha shivratri brahmotsavam 2026
ఆంధ్రప్రదేశ్

Srisailam Toll Gate Free,శ్రీశైలం వెళ్లే భక్తులకు రెండు శుభవార్తలు.. నాలుగు రోజులు పూర్తిగా ఉచితం, శివరాత్రి స్పెషల్ – four days toll fees exemption for devotees on the occasion of maha shivratri brahmotsavam 2026

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srisailam Toll Gate Free,శ్రీశైలం వెళ్లే భక్తులకు రెండు శుభవార్తలు.. నాలుగు రోజులు పూర్తిగా ఉచితం, శివరాత్రి స్పెషల్ – four days toll fees exemption for devotees on the occasion of maha shivratri brahmotsavam 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Four Days Toll Fees Exemption For Srisailam Devotees: శ్రీశైలం మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. మరో రెండు రోజుల్లో శివరాత్రి ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల పాటూ శ్రీశైలం వచ్చే వాహనాలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. టోల్‌గేట్ల దగ్గర ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.

హైలైట్:

  • శ్రీశైలం వచ్చే భక్తులకు తీపికబురు
  • నాలుగు రోజులు టోల్ ఫీజు లేదు
  • ఉచితంగా లడ్డూలు పంపిణీ
Srisailam Toll Fees Free
శ్రీశైలంలో నాలుగు రోజులు టోల్ ఫ్రీ(ఫోటోలు– Samayam Telugu)
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. భక్తులతో రద్దీ కనిపిస్తోంది. ఉత్సవాల్లో ఐదో రోజు రావణ వాహనంపై శ్రీభ్రమరాంబ, మల్లికార్జునస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి (13) నుంచి 16 వరకు శ్రీశైలం వచ్చే వాహనాలకు టోల్ మినహాయింపు ఇచ్చారు.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయం, అటవీశాఖ టోల్‌గేట్ల దగ్గర రుసుం మినహాయింపు ఇచ్చినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటించారు. అంతేకాదు నాలుగు రోజుల పాటూ భక్తులకు ఉచితంగా లడ్డూలను కూడా అందిస్తారుశ్రీశైలం వచ్చే భక్తులకు రాత్రివేళల్లో కూడా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలంలోని దేవస్థానం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎస్పీ సునీల్‌ షొరాణ్‌తో కలిసి ఏర్పాట్లును పరిశీలించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పా్ట్లు చేశామన్నారు. భక్తులు అధికారులు, పోలీసులకు సహరించాలని కలెక్టర్ రాజకుమారి కోరారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి గురువారం వరకు 2,59,050 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. మహాశివరాత్రి రోజు భక్తులు భారీగా తరలివస్తారు.. ఈ క్రమంలో ఆ రోజు దాదాపు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీశైలం వచ్చే భక్తుల కోసం నంద్యాల-శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఏపీఎస్‌ఆర్టీసీ 1,800, తెలంగాణ నుంచి 1,000, ఇతర ప్రాంతాల నుంచి కలిపి 3 వేల బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిలు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహాశివుడి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో దోర్నాల-శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ వి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ‘మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఘాట్ రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవర్ల వాహనం నడపాలి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయబడింది.
రద్దీ సమయాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, వాటికి నిర్దిష్ట సమయాలు కేటాయించబడతాయి. ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు విధుల్లో ఉంటాయి’ అని తెలిపారు.

‘ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఘాట్ రోడ్డులో అతి వేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి. అనవసరంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు. నైపుణ్యం కలిగిన డ్రైవర్లతోనే ప్రయాణం చేయాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, ఇంజిన్ పరిస్థితి ముందుగా తనిఖీ చేసుకోవాలి. పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను గౌరవించి సహకరించాలి. ప్రయాణికులు, భక్తులకు ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేశాము. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మహాశివరాత్రి వేడుకలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము’ అని ఎస్పీ తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి