Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం

13 February 2026

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

13 February 2026

Hindu Belief: ఇతరుల చెప్పులు, దుస్తులు ధరించడం అరిష్టమా? ఇది తప్పక తెలుసుకోండి..!

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Agrigold Plots Relief,అగ్రిగోల్డ్‌ బాధితులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ – andhra pradesh government key orders on registration completed agrigold plots
ఆంధ్రప్రదేశ్

Ap Govt Agrigold Plots Relief,అగ్రిగోల్డ్‌ బాధితులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ – andhra pradesh government key orders on registration completed agrigold plots

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Agrigold Plots Relief,అగ్రిగోల్డ్‌ బాధితులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ – andhra pradesh government key orders on registration completed agrigold plots
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Agrigold Plots Relief: ఏపీలో అగ్రిగోల్డ్ వ్యవహారం తెలిసిందే. అయితే అగ్రిగోల్డ్ సంస్థంకు సంబంధించి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్లాట్లు కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారికి ఊరట దక్కింది. ఏపీ ప్రభుత్వం జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

హైలైట్:

  • అగ్రిగోల్డ్ ప్లాట్లకు సంబంధించి కీలక ఉత్తర్వులు
  • అగ్రిగోల్డ్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వారికి ఊరట
  • జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ
Andhra Pradesh Agrigold Plots
ఏపీ అగ్రిగోల్డ్ ప్లాట్లపై ఊరట(ఫోటోలు– Samayam Telugu)
అగ్రిగోల్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొంతమంది అగ్రిగోల్డ్‌ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ఆ ప్లాట్లను అగ్రిగోల్డ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు కాకముందు కొనుక్కున్నారు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే గతంలో వారి స్థలాల్ని జప్తు నుంచి మినహాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వం యథాతథంగా పునరుద్ధరించింది. ఆ ప్లాట్ల యజమానులకు ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ నిర్ణయంపై ప్లాట్లు కొనుగోలు చేసినవారు హర్షం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.2015 ఫిబ్రవరి 20న అప్పటి టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌కు చెందిన 16,857.81 ఎకరాల భూమి, 82,207.08 చదరపు గజాల స్థలాలను జప్తు (జీవో 23) చేసిన సంగతి తెలిసిందే. అయితే జప్తు చేసిన భూముల్లో కొన్నిచోట్ల అగ్రిగోల్డ్‌‌కు సంబంధించి లే అవుట్లు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఈ లే అవుట్లలో వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు పూర్తిగా డబ్బులు చెల్లించి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే అప్పటికి అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదు కాలేదు.. ఆ తర్వాత నమోదయ్యాయి. అయితే ఈ విషయాన్ని బాధితులు అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలో పేదలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2.39 లక్షలు ఇస్తారు, కీలక నిర్ణయం

అయితే ఈ ప్లాట్లను ప్రభుత్వం జప్తు నుంచి మినహాయిస్తున్నట్లు స్పష్టంగా ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇచ్చిన మినహాయింపును తొలగించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 9న జీవో 19లో సవరణ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులైన ప్లాట్ల యజమానులు ఇటీవల సీఐడీ అధికారులు, ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. తమ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లటంతో వారు సానుకూలంగా స్పందించారు. తాజాగా మరోసారి ఈ ప్లాట్లను జప్తు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్లాట్లకు సంబంధించి జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట దక్కనుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి