Andhra Pradesh Agrigold Plots Relief: ఏపీలో అగ్రిగోల్డ్ వ్యవహారం తెలిసిందే. అయితే అగ్రిగోల్డ్ సంస్థంకు సంబంధించి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్లాట్లు కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారికి ఊరట దక్కింది. ఏపీ ప్రభుత్వం జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.
హైలైట్:
- అగ్రిగోల్డ్ ప్లాట్లకు సంబంధించి కీలక ఉత్తర్వులు
- అగ్రిగోల్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి ఊరట
- జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ

ఏపీలో పేదలకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2.39 లక్షలు ఇస్తారు, కీలక నిర్ణయం
అయితే ఈ ప్లాట్లను ప్రభుత్వం జప్తు నుంచి మినహాయిస్తున్నట్లు స్పష్టంగా ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇచ్చిన మినహాయింపును తొలగించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 9న జీవో 19లో సవరణ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులైన ప్లాట్ల యజమానులు ఇటీవల సీఐడీ అధికారులు, ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. తమ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లటంతో వారు సానుకూలంగా స్పందించారు. తాజాగా మరోసారి ఈ ప్లాట్లను జప్తు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్లాట్లకు సంబంధించి జప్తు నుంచి మినహాయించే ఉత్తర్వుల పునరుద్ధరణ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట దక్కనుంది.


