Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Wall Cleaning Hacks: కొత్త గోడలపై పిల్లలు బొమ్మలు గీశారా? టెన్షన్ పడకండి.. పెయింట్ ఊడకుండా క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్!

13 February 2026

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన కాంగ్రెస్.. చిట్యాలలో ప్రత్యేక విజయం

13 February 2026

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Jaahnavi Kandula Father Srikanth Died,కందుల జాహ్నవి ఇంట మరో విషాదం.. తండ్రి శ్రీకాంత్ మృతి, పరిహారం గురించి తెలియక ముందే – telugu student who died in us jaahnavi kandula father srikanth died 2 days before rs 262 crore settlement
ఆంధ్రప్రదేశ్

Jaahnavi Kandula Father Srikanth Died,కందుల జాహ్నవి ఇంట మరో విషాదం.. తండ్రి శ్రీకాంత్ మృతి, పరిహారం గురించి తెలియక ముందే – telugu student who died in us jaahnavi kandula father srikanth died 2 days before rs 262 crore settlement

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Jaahnavi Kandula Father Srikanth Died,కందుల జాహ్నవి ఇంట మరో విషాదం.. తండ్రి శ్రీకాంత్ మృతి, పరిహారం గురించి తెలియక ముందే – telugu student who died in us jaahnavi kandula father srikanth died 2 days before rs 262 crore settlement
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Jaahnavi Kandula Father Died: అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కుటుంబంలో మరో విషాదం జరిగింది. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కూతురికి సియోటల్ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తున్న విషయం తెలియక ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీకాంత్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.

హైలైట్:

  • జాహ్నవి కందుల కుటుంబంలో విషాదం
  • ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ మృతి
  • గుండెపోటుతో చనిపోయిన శ్రీకాంత్
Jaahnavi Kandula
జాహ్నవి కందుల తండ్రి మృతి(ఫోటోలు– Samayam Telugu)
అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయి జాహ్నవి కందుల కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. జాహ్నవి తండ్రి కందుల శ్రీకాంత్ గుండెపోటుతో కన్నుమూశారు.. ఆయన అంత్యక్రియల్ని కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించారు. జాహ్నవి కుటుంబానికి సియాటెల్‌ ప్రభుత్వం 29 మిలియ్ డాలర్లు (దాదాపు రూ.262.75 కోట్లు) పరిహారం చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు రెండు రోజుల ముందే శ్రీకాంత్ కన్నుమూశారు. జాహ్నవి మరణం తర్వాత తండ్రి శ్రీకాంత్ న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనలో ఉన్నారు.. అందుకే విధులకు వెళ్లకుండా లాంగ్‌ లీవ్‌ తీసుకున్నారు. ఇటీవల ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన విధుల్లో చేరేందుకు గుంతకల్లు వెళ్లారు.. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. జాహ్నవి మరణం తర్వాత తండ్రి శ్రీకాంత్ మనోవేదనతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరికి జాహ్నవి మరణంపై న్యాయ పోరాటం తర్వాత పరిహారం ఇచ్చారనే విషయం తెలియకుండానే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అన్నారు జాహ్నవి మామయ్య శ్రీధర్. అయితే జాహ్నవికి సోదరి కూడా ఉందని తెలిపారు. జాహ్నవి కుటుంబ సభ్యులకు అమెరికా అధికారుల నుంచి సమాచారం వచ్చిందట.. మార్చిలో అమెరికాకు రావాలని ఫోన్ చేసి చెప్పారట.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శ్రీకాంత్ హెడ్‌కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్నారు.. ఆయన భార్య పేరు విజయలక్ష్మి. ఈ దంపతులకు జాహ్నవి, మేఘన కుమార్తెలు కాగా.. జాహ్నవి పెద్ద కుమార్తె. ఆమె ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాలోని సియాటెల్‌ వెళ్లారు.. అక్కడ నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. జాహ్నవి 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని పోలీసు అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్నారు. అతడు ఓవర్ స్పీడ్‌తో వాహనాన్ని నడిపాడు.. 40 కిమీ వేగంగా వెళ్లాల్సిన చోట 119 కిమీ వేగంగా వెళ్లి జాహ్నవిని ఢీకొట్టాడు. పాపం ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడ్డారు.

ఈ ప్రమాదం తర్వాత ఆ పోలీస్ అధికారి జాహ్నవి గురించి దారుణంగా మాట్లాడాడు.. ఆమె మరణానికి విలువ లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. బాడీ కెమెరాలో వీడియోలో అతడి మాటలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కెవిన్ తీరుపై విమర్శలు రావడంతో విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి జాహ్నవి తండ్రి న్యాయ పోరాటం కొనసాగుతోంది.. అలాగే తెలుగు సంఘాలు కూడా ఆ కుటుంబానికి అండగా నిలిచాయి. తాజాగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్‌ డాలర్లు (రూ.262.75 కోట్లు) పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మరణం బాధాకరమని ఎరికా ఇవాన్స్‌ అన్నారు. ఆమె కుటుంబానికి ఈ పరిహారంతో కొంతైనా రిలీఫ్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు. అయితే ఈ పరిహారం ప్రకటించే ముందే జాహ్నవి తండ్రి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి